హైదరాబాద్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో గురువారం దీపక్, అబ్ధుల్ అనే మరో ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు. వారిలో ఒకరు సినీ నిర్మాత వున్నారని తెలుస్తోంది. అరెస్ట్ అయిన దీపక్, అబ్దుల్ నుంచి పోలీసులు 67 ఎల్ఎస్డీ డ్రగ్స్ పాకెట్స్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అరెస్ట్ అయిన హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ బెండెన్ బెన్ వెల్లడించిన వివరాల ఆధారంగానే పోలీసులు దీపక్, అబ్దుల్ని అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరి అరెస్ట్తో డ్రగ్స్ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన మొత్తం నిందితుల సంఖ్య 10 కి చేరింది.
సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు తెలిపిన వివరాల ప్రకారం ప్రధాన నిందితుడు కెల్విన్ డ్రగ్స్ని గోవా నుంచి హైదరాబాద్కి ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. హైదరాబాద్లో బాగా పేరున్న విద్యాసంస్థల్లో విద్యార్థులు డ్రగ్స్కి బానిసలు అవుతున్నారని తెలిసి అటువంటి విద్యా సంస్థల్లో తమ పిల్లల్ని చేర్పించిన తల్లిదండ్రులు ఆందోళనకి గురవుతున్నారు.
ఇదిలావుంటే, 'ఈ కేసులో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకి గురవుతున్నట్టుగా డ్రగ్స్కి బానిసైన విద్యార్థుల పేర్లు కానీ లేదా వారు చదువుతున్న విద్యా సంస్థల పేర్లు కానీ బహిర్గతం చేయబోం' అని పోలీసులు హామీ ఇచ్చినట్టు సమాచారం.
సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు తెలిపిన వివరాల ప్రకారం ప్రధాన నిందితుడు కెల్విన్ డ్రగ్స్ని గోవా నుంచి హైదరాబాద్కి ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. హైదరాబాద్లో బాగా పేరున్న విద్యాసంస్థల్లో విద్యార్థులు డ్రగ్స్కి బానిసలు అవుతున్నారని తెలిసి అటువంటి విద్యా సంస్థల్లో తమ పిల్లల్ని చేర్పించిన తల్లిదండ్రులు ఆందోళనకి గురవుతున్నారు.
ఇదిలావుంటే, 'ఈ కేసులో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకి గురవుతున్నట్టుగా డ్రగ్స్కి బానిసైన విద్యార్థుల పేర్లు కానీ లేదా వారు చదువుతున్న విద్యా సంస్థల పేర్లు కానీ బహిర్గతం చేయబోం' అని పోలీసులు హామీ ఇచ్చినట్టు సమాచారం.