యాప్నగరం

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం

ప్రముఖ బెంగాలీ చిత్ర నిర్మాత, రచయిత బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం మరణించారు.

Samayam Telugu 10 Jun 2021, 5:06 pm
గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు కరోనా కారణంగా కొందరు సినీ ప్రముఖులు మరణిస్తుంటే.. మరోవైపు అనారోగ్య సమస్యలతో ఇంకొంతమంది సెలెబ్రిటీలు కన్నుమూస్తుండటం యావత్ సినీ లోకాన్ని కలవరపెడుతోంది. తాజాగా ప్రముఖ బెంగాలీ చిత్ర నిర్మాత, రచయిత బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Samayam Telugu ప్రముఖ నిర్మాత కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
Buddadeb Dasgupta passes away


ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఈ విషయం చాలా బాధ పెట్టిందంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా వైవిధ్యభరిత రచనలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల జీవితాలకు అద్ధం పడతాయని, ఆయన గొప్ప తత్వవేత్త, కవి అని మోదీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేస్తూ బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా మరణం విచారకరం అని, ఆయన తన రచనల ద్వారా తన సాహిత్యాన్ని సినీలోకానికి పరిచయం చేశారని, ఆయన మరణం సినీలోకానికి తీరని లోటని అన్నారు.

దాదాసాహెబ్ ఫాల్కే, సత్యజిత్ రే వాస్తవిక చిత్రాల నుంచి ప్రేరణ పొందిన బుద్ధదేవ్‌కు ''బాగ్‌ బహదూర్‌, తహదర్‌ కథ, చరాచార్‌, ఉత్తర'' లాంటి సినిమాలు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. చిత్ర సీమకు అందించిన సేవలకు గాను అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.