యాప్నగరం

శ్రీవారి సేవలో దిల్‌రాజు దంపతులు

సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

Samayam Telugu 13 Oct 2020, 8:54 am
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్ దంపతులు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య తేజస్వినితో ఉదయం తిరుమలకు చేరుకున్న దిల్ రాజు వీఐపీ దర్శన సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశ్వీరచనాలు ఇచ్చారు. అనంతరం తిరిగివెళ్తున్న దిల్‌రాజును మీడియా ప్రతినిధులు పలకరించగా మాట్లాడేందుకు నిరాకరించారు. మే నెలలో తేజస్వినిని వివాహం చేసుకున్న ఆయన భార్యతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం ఇది రెండోసారి.
Samayam Telugu శ్రీవారి సేవలో దిల్‌రాజు దంపతులు


Also Read: అందాలన్నీ బట్టబయలు చేస్తూ.. సరికొత్త లుక్‌లో వింక్ బ్యూటీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.