యాప్నగరం

శ్యామ్ కె నాయుడుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు: పోలీసులు

టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు అరెస్ట్ అయినట్టు నిన్న వార్తలు వచ్చాయి. ఓ నటి ఫిర్యాదు మేరకు ఎస్.ఆర్.నగర్ పోలీసులు శ్యామ్‌ను అదుపులోకి తీసుకున్నారని అన్నారు.

Samayam Telugu 28 May 2020, 10:42 am
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై ఓ నటి హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ నటి ఫిర్యాదు మేరకు శ్యామ్ కె నాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారని, ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఎస్.ఆర్.నగర్ పోలీసులు శ్యామ్‌ను అరెస్టు చేశారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. ఆయనకు సమన్లు మాత్రమే పంపించారు. శ్యామ్ తనను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి తనతో సహజీవనం చేశారని.. అయితే ఇప్పుడు తనను పెళ్లి చేసుకోనని మోసం చేశారని ఫిర్యాదులో ఆ నటి పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
Samayam Telugu శ్యామ్ కె నాయుడు
Shyam K Naidu


‘‘బుధవారం ఉదయం ఒక సినీ నటి సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై ఫిర్యాదు చేశారు. శ్యామ్ తనను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి శారీరకంగా దగ్గరయ్యారని, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడంలేదని ఆమె ఆరోపించారు. ఫిర్యాదును స్వీకరించిన తరవాత మేం శ్యామ్‌ను ప్రశ్నించడానికి పిలిచాం. ప్రస్తుతం విచారణ జరుగుతోంది’’ అని పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న వెల్లడించారు.

Also Read: ఎన్టీఆర్ జయంతి: యుగపురుషుడు మళ్లీ పుడితే.. జయహో నాయకా

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆ నటితో శ్యామ్ ఆరు నెలలు సహజీవనం చేశారు. ఇటీవల వీరి మధ్య దూరం పెరిగిందన్నారు. ఆ నటి ఫిర్యాదు మాత్రమే చేశారని, శ్యామ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు. ‘‘ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిచాం. వారి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ వారు సెటిల్‌మెంట్ చేసుకోకపోతే శ్యామ్ కె నాయుడుపై ఐపీసీ సెక్షన్ 493 కింద కేసు నమోదు చేస్తాం’’ అని ఏసీపీ తిరుపతన్న స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.