యాప్నగరం

‘అర్జున్ సురవరం’ ఫస్ట్ సింగిల్.. మెలోడి అదిరింది!

ఈ చిత్రంలోని తొలి లిరికల్ సాంగ్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ‘నా మనసిలా మనసిలా ఓ మనసే కోరుకుందే’ అంటూ మొదలైన ఈ మెలోడీ అద్భుతంగా ఉంది.

Samayam Telugu 12 Mar 2019, 8:08 pm
నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి జంటగా టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అర్జున్ సురవరం’. బి.మధు (ఠాగూర్ మధు) సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పి, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కనితన్’కు ఇది రీమేక్. ‘కనితన్’కు కూడా టి.ఎన్.సంతోషే దర్శకత్వం వహించారు. మొదట ‘ముద్ర’ అనే టైటిల్‌ను అనుకున్నా అది కాస్త వివాదం కావడంతో ‘అర్జున్ సురవరం’గా మార్చారు. మార్చి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు చిత్ర ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు.
Samayam Telugu Arjun_Suravaram


ప్రొమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రంలోని తొలి లిరికల్ సాంగ్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ‘నా మనసిలా మనసిలా ఓ మనసే కోరుకుందే’ అంటూ మొదలైన ఈ మెలోడీ అద్భుతంగా ఉంది. వీడియోలో లావణ్య త్రిపాఠి చాలా అందంగా కనిపించింది. అనురాగ్ కులకర్ణి, చిన్మయి ఆలపించిన ఈ పాటను శ్యామ్ సీఎస్ స్వరపరిచారు.

కాగా, ఈ సినిమా ద్వారా నిఖిల్ తొలిసారి జర్నలిస్టుగా కనిపించనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో హిట్టు కొట్టాలని చూస్తున్నారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోరా, సత్య, నాగినీడు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్‌ను సంగీతాన్ని సమకూర్చారు. సూర్య సినిమాటోగ్రఫీ అందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.