యాప్నగరం

గోపిచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ ఆన్ ది వే!

గోపిచంద్, నయనతార లేటెస్ట్ మూవీ ‘ఆరడుగుల బుల్లెట్ మూవీ రిలీజ్‌కు రెడీ అయ్యింది.

TNN 29 Apr 2017, 6:12 pm
వరుస చిత్రాలతో బిజీ షెడ్యూల్స్‌తో ఉన్న గోపీచంద్ నటించిన తాజా చిత్రం "ఆరడుగుల బుల్లెట్" విడుదలకు సిద్ధమవుతోంది. గోపీచంద్- బి.గోపాల్ ల కాంబినేషన్ లో జయా బాలాజీ రియల్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తాండ్ర రమేష్ నిర్మాత. గోపీచంద్ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను మే 19న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేసుకొంటున్నారు.
Samayam Telugu gopichand aaradugula bullet release date confirmed
గోపిచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ ఆన్ ది వే!


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ.. "ఫ్యామిలీ ఆడియన్స్ తోపాటు యూత్, మాస్ ఆడియన్స్ కు నచ్చే అంశాలు మేళవించి దర్శకులు బి.గోపాల్ "ఆరడుగుల బుల్లెట్" చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ రచయితలు వక్కంతం వంశీ అందించిన కథ, అబ్బూరి రవి మాటలు, బాల మురుగన్ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్స్‌గా నిలుస్తాయి.

గోపీచంద్ కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలుస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న "ఆరడుగుల బుల్లెట్"ను మే 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం." అన్నారు.

ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్, చలపతిరావ్, సలీం బేగ్, ఉత్తేజ్, జయప్రకాష్ రెడ్డి, ఫిరోజ్ అబ్బాసి, రమాప్రభ, సురేఖావాణి, సన, సంధ్యా జనక్, మధునందన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.