యాప్నగరం

గోపిచంద్ సినిమా మళ్లీ మొదలైంది

గోపిచంద్ మూడేళ్ళ క్రితం బి.గోపాల్ దర్శకత్వంలో ఓ సినిమాలో ప్రారంభించాడు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఆ సినిమా ఇప్పటికీ పూర్తి కాలేదు.

TNN 21 Dec 2016, 4:01 pm
గోపిచంద్ మూడేళ్ళ క్రితం బి.గోపాల్ దర్శకత్వంలో ఓ సినిమాలో ప్రారంభించాడు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఆ సినిమా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ సినిమాని ఆర్థిక ఇబ్బందులు చుట్టిముట్టడంతో సినిమాను మధ్యలోనే ఆపేశారు. అయితే ఇటీవల సడెన్‌గా సినిమా పూర్తి చేయాలాని రంగంలోకి దిగారు.
Samayam Telugu gopichand b gopal film back on track join with pvp
గోపిచంద్ సినిమా మళ్లీ మొదలైంది


షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయిన ఈ చిత్రంలో ఓ రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు బ్యాలన్స్ ఉంది. వీటిని పూర్తి చేయడానికి బడ్జెట్‌ ఇబ్బందులు తలెత్తాయి. వీటితో పాటు సినిమాను రిలీజ్ చేసుకోవడానికి పబ్లిసిటీ కూడా భారీగా చేసుకోవాలి. ఓ వైపు డబ్బు అప్పు ఇచ్చిన ఫైనాన్షియర్స్ ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో ఏం చేయాలో.. తోచని పరిస్థితుల్లో ఈ సినిమాను పూర్తిగా బడా నిర్మాత పీవీపీకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా మిగిలిన షూటింగ్ పూర్తి చేసి పీవీపీ విడుదల చేయనున్నట్లు టాక్. టైటిల్, ఫస్ట్ లుక్ దీపావళికి విడుదల చేస్తామంటూ అనౌన్స్ చేశారు. అయితే నయనతారకు డేట్స్ ఖాళీ లేకపోవడంలో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో పీవీపీ నయనతారని సంప్రదించినట్టు సమాచారం. దీంతో గోపిచంద్‌కు కాస్త భరోసా వచ్చింది. కానీ మూడేళ్ళ క్రిందటి సినిమా ఇప్పుడు ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా అనే అనుమానాలు లేకపోలేదు. మరి పీవీపీకి లక్ కలిసొస్తుందో లేదో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.