మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో మాచో హీరో గోపీచంద్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. ఈ బ్యానర్లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ఇది. ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ చిత్రంలో నటించే హీరోయిన్ను తాజాగా ఖరారు చేశారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నటించనుంది. ఈ మేరకు మంగళవారం చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా పనిచేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ చిత్రాల్లో తమన్నా నటించారు. వీరి కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా ఇది. అలాగే, గోపీచంద్తో సంపత్ నంది పనిచేయడం ఇది రెండోసారి. గతంలో వీరిద్దరి కాంబోలో ‘గౌతమ్ నంద’ సినిమా వచ్చింది. అయితే, ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
Also Read: 'సైరా'కి ఫుల్ బజ్.. పవన్ రికార్డ్ని చిరు దాటతాడా?
భారీ బడ్జెట్తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నట్లు నిర్మాత శ్రీనివాస చిట్టూరి వెల్లడించారు. భారీ తారాగణంతో సినిమాను తెరకెక్కిస్తామన్నారు. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సంపత్ నంది. ఇది గోపీచంద్కు 28వ చిత్రం.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం గోపీచంద్ ‘చాణక్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఫ్లాపులతో వెనకబడిపోయిన గోపీచంద్.. ఈ సినిమా హిట్తో మళ్లీ ఫామ్లోకి రావాలని చూస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే గనుక.. సంపత్ నంది, గోపీచంద్ కాంబోపై భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం.
సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా పనిచేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ చిత్రాల్లో తమన్నా నటించారు. వీరి కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా ఇది. అలాగే, గోపీచంద్తో సంపత్ నంది పనిచేయడం ఇది రెండోసారి. గతంలో వీరిద్దరి కాంబోలో ‘గౌతమ్ నంద’ సినిమా వచ్చింది. అయితే, ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
Also Read: 'సైరా'కి ఫుల్ బజ్.. పవన్ రికార్డ్ని చిరు దాటతాడా?
భారీ బడ్జెట్తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నట్లు నిర్మాత శ్రీనివాస చిట్టూరి వెల్లడించారు. భారీ తారాగణంతో సినిమాను తెరకెక్కిస్తామన్నారు. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సంపత్ నంది. ఇది గోపీచంద్కు 28వ చిత్రం.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం గోపీచంద్ ‘చాణక్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఫ్లాపులతో వెనకబడిపోయిన గోపీచంద్.. ఈ సినిమా హిట్తో మళ్లీ ఫామ్లోకి రావాలని చూస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే గనుక.. సంపత్ నంది, గోపీచంద్ కాంబోపై భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం.