యాప్నగరం

వివాదంలో చిక్కుకున్న 'ఆరడుగుల బుల్లెట్'

ఈ నెల 9నే ఆడియెన్స్ ముందుకు రానున్న గోపీచంద్ అప్‌కమింగ్ మూవీ 'ఆరడుగుల బుల్లెట్' వివాదంలో...

Samayam Telugu 6 Jun 2017, 11:05 pm
ఈ నెల 9నే ఆడియెన్స్ ముందుకు రానున్న గోపీచంద్ అప్‌కమింగ్ మూవీ 'ఆరడుగుల బుల్లెట్' వివాదంలో చిక్కుకుంది. బి.గోపాల్ డైరెక్షన్‌లో సి.కల్యాణ్ నిర్మిస్తున్నఈ సినిమా విడుదలకు సరిగ్గా ఇంకా కేవలం మూడు రోజులే మిగిలి వుంది. ఇంతలోనే ఈ సినిమా విడుదల ఆపాలని కోరుతూ చిత్ర నిర్మాత సి.కల్యాణ్‌పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకి ఓ ఫిర్యాదు అందినట్టు తెలుస్తోంది.
Samayam Telugu gopichands aaradugula bullet movie controversy
వివాదంలో చిక్కుకున్న 'ఆరడుగుల బుల్లెట్'


సి కళ్యాణ్ తన వద్ద రూ.6 కోట్లు అప్పుగా తీసుకుని మోసం చేశాడంటూ సహదేవ్ అనే ఎన్నారై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సి కళ్యాణ్ తన వద్ద అప్పుగా తీసుకున్న మొత్తం తిరిగి చెల్లించే వరకు 'ఆరడుగుల బుల్లెట్' విడుదలని నిలిపివేయాలని సహదేవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.

నిర్మాత సి కళ్యాణ్‌పై పోలీసులకి ఫిర్యాదులు అందడం ఇదేం తొలిసారి కాదు. రెండేళ్ల క్రితం సి కళ్యాణ్ నివాసం వుంటున్న అపార్ట్‌మెంట్‌కే చెందిన ఓ మహిళా డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో జూబ్లీహిల్స్ పోలీసులు ఆయనపై నిర్భయ కేసు నమోదు చేశారు. అంతకన్నా ముందు 2011లో ఫ్యాక్షనిస్ట్ మద్దెలచెర్వు సూరి హత్యకేసులో నిందితుడైన భానుకిరణ్‌తో కలిసి సి కళ్యాణ్ పలు భూసెటిల్‌మెంట్స్ చేశాడనే అభియోగాల కింద అప్పట్లో సీఐడీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఇదిలావుండగా తాజాగా 'ఆరడుగుల బుల్లెట్' విడుదలకి మరో మూడు రోజులే మిగిలి వుందనగా ఎదురైన ఈ వివాదాన్ని ఆ చిత్ర యూనిట్ ఎలా అధిగమిస్తుందో చూడాలి మరి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.