యాప్నగరం

Rahul Gandhi T Shirt : దేశానికి ఏం సందేశాన్ని ఇవ్వదల్చుకున్నారు?.. బీజేపీపై గృహలక్ష్మీ తులసి ఫైర్

గృహలక్ష్మీ తులసి అలియాస్ కస్తూరీ శంకర్ (gruhalakshmi kasthuri shankar) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె బీజేపీ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న ట్విట్టర్‌ వార్‌‌లోకి దూకింది. తాజాగా రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో వేసుకున్న టీ షర్ట్ ధర మీద బీజేపీ ఓ ట్వీట్ వేసింది. ఆయన ధరించిన టీ షర్ట్ ధరను ఇలా బీజేపి చెప్పడంతో కస్తూరీ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Authored byబండ కళ్యాణ్ | Samayam Telugu 9 Sep 2022, 9:01 pm
గృహలక్ష్మీ (gruhalakshmi) సీరియల్‌లో తులసి పాత్రతో కస్తూరీ శంకర్ (kasthuri shankar) ఇప్పుడు తెలుగు వారికి దగ్గరైంది. ఒకప్పుడు భారతీయుడు, అన్నమయ్య వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు బుల్లితెరపై తులసిగా కస్తూరీ తెలుగు వారందరి గుండెల్లో స్థానం సంపాదించేసుకుంది. ఇక ఆమె ఓ వక్త, లాయర్, పొలిటికల్ అనలిస్ట్, క్రీడా విశ్లేషకురాలు. ఇలా ఆమెకు ఎన్నో రంగాల్లో విశిష్టమైన నాలెడ్జ్ ఉంది. సోషల్ మీడియా వేదికగా అనేక విషయాల మీద స్పందిస్తుంటుంది.
Samayam Telugu Gruhalakshmi Tulasi
గృహలక్ష్మీ తులసి


తాజాగా ఆమె బీజేపీ వేసిన ట్వీట్ మీద మండిపడింది, ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాందీ జోడో యాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రజలతో మమేకమై.. వారి సమస్యలను మరింత లోతుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ బీజేపీ దాడికి దిగింది. ఆయన ధరించి టీషర్ట్‌ ధరపై విమర్శలు గుప్పించింది. భారత్, దేఖో అనే క్యాప్షన్‌తో టీ షర్టు ధర రూ.41,000 అని ట్విట్టర్‌లో షేర్ చేసింది.

అయితే బీజేపీ చేస్తున్నఈ ప్రచారానికి కాంగ్రెస్ కూడా అంతే ధీటుగా రిప్లై ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ధరించే సూట్ ధర రూ.10 లక్షలు అని, బ్రేక్ ఫాస్ట్‌కు ఎన్ని లక్షలు ఖర్చు పెడుతుంటాడో అంటూ విమర్శలను తిప్పి కొట్టేసింది కాంగ్రెస్. ఇలా ట్విట్టర్‌లో చిన్నపాటి వార్ జరుగుతుంటే.. కస్తూరీ శంకర్ తన స్టైల్లో స్పందించింది.

‘రాహుల్ గాంధీ టీ షర్ట్ మీద మీకు ఎందుకు ఆసక్తి ఉంది.. ఇక్కడ మీరు ఎలాంటి సందేశాన్ని ఇవ్వదల్చుకున్నారు.. ధనవంతులైనంత మాత్రానా దేశభక్తి ఉండదనా?.. ఖరీదైన దుస్తులు ధరించడం ఏమైనా తప్పా? బీజేపీలోనే ఇలాంటివి ఎన్నో ఉన్నాయ్.. మళ్లీ మీరు పక్క చూపులు ఎందుకు చూస్తున్నారు.. ప్రజలకు ఇంకా తెలివిగా ఆలోచిస్తున్నారు’ అంటూ కస్తూరీ ట్వీట్ వేసింది.
రచయిత గురించి
బండ కళ్యాణ్
బండ కళ్యాణ్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయం, సినిమా రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.