యాప్నగరం

Mahesh Babu‌కు ఐటీ విభాగం ఝలక్.. బ్యాంకు అకౌంట్లు అటాచ్!

అడర్వటైజ్‌‌మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయానికి సర్వీస్ ట్యాక్స్ చెల్లించకపోవడంతో ఐటీ విభాగం మహేశ్ బాబు బ్యాంక్ అకౌంట్లను అటాచ్ చేసింది.

Samayam Telugu 28 Dec 2018, 12:41 am
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జీఎస్టీ విభాగం షాకిచ్చింది. ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయానికి సర్వీస్ ట్యాక్స్ చెల్లించక పోవడంతో ఆయన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. 2007-08 ఏడాది ప్రకటనల ఆదాయానికి గానూ ప్రిన్స్ ఐటీ విభాగానికి రూ.18.5 లక్షలు బకాయి చెల్లించలేదని సమాచారం. దీంతో మహేశ్ బాబుకు చెందిన ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు ఖాతాలను జీఎస్టీ కమిషనరేట్ అటాచ్ చేసింది.. వీటిలో రూ.73.5 లక్షల నగదు ఉంది.
Samayam Telugu maheshbabu-1


యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఉన్న మహేశ్ ఖాతాలను జీఎస్టీ కమిషనర్ అటాచ్ చేశారు. పన్ను బకాయిలకు సంబంధించి వడ్డీ, పెనాల్టీలను కూడా ప్రిన్స్ చెల్లించాల్సి ఉంది.

టాలీవుడ్ సూపర్ స్టార్‌గా ఎదిగిన మహేశ్ బాబు 2005 నుంచి వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. పలు ఉత్పత్తులకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. కానీ యాడ్స్ ద్వారా సమకూరిన ఆదాయానికి ఆయన సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదు.

పోల్: 2018లో బెస్ట్ యాక్టర్ ఎవరు?

గతంలో నాన్నకు ప్రేమతో విడుదల సమయంలో ఎన్టీఆర్ కూడా పన్నుల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.