యాప్నగరం

మెగా ఫ్యాన్స్ మధ్యలోకి దూరిన డైరెక్టర్

దువ్వాడ జగన్నాథమ్’ టీజర్‌కి అనూహ్యంగా వేలకొద్దీ డిస్‌లైక్స్ రావడంతో చిత్ర యూనిట్ దిద్దుబాటు చర్యలకు

TNN 4 Mar 2017, 9:38 pm
సోషల్ మీడియా వేదికగా గత కొంతకాలంగా నడుస్తున్న మెగా ఫ్యాన్స్ కోల్డ్‌వార్‌లోకి స్టార్ డైరెక్టర్ దూరాడు. గత ఏడాది సరైనోడు సినిమా వేడుకలో పవన్ కల్యాణ్ గురించి ‘చెప్పను బ్రదర్’ అంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలతో గొడవ మొదలైంది. ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’ టీజర్‌కి అనూహ్యంగా వేలకొద్దీ డిస్‌లైక్స్ రావడంతో చిత్ర యూనిట్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ డిస్‌లైక్స్ వెనుక పవన్ కల్యాణ్ అభిమానుల హస్తం ఉన్నట్లు అల్లు అర్జున్ అభిమానులు ఆరోపిస్తున్నారు.
Samayam Telugu harish shankar makes pawan fans happy
మెగా ఫ్యాన్స్ మధ్యలోకి దూరిన డైరెక్టర్


తాజాగా డీజే దర్శకుడు హరీశ్ శంకర్.. పవన్ అభిమానులను శాంతపరిచే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాటమరాయుడు సినిమా నుంచి శుక్రవారం విడుదలైన మిరా..మిరా.. మీసం పాటను ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసి.. చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న డీజే సినిమాపై పవన్ అభిమానుల ఎఫెక్ట్ పడకుండా ఉండేందుకే హరీశ్ శంకర్ ఇలా కాటమరాయుడు పాటను తెరపైకి తెచ్చారని ఫిల్మ్‌నగర్ టాక్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.