యాప్నగరం

మల్టీస్టారర్ సినిమాని డైరెక్ట్ చేయనున్న హరీష్ శంకర్

గబ్బర్ సింగ్ తర్వాత దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మళ్లీ తన కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ హరీష్ శంకర్..

TNN 15 Aug 2017, 3:34 pm
గబ్బర్ సింగ్ తర్వాత దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మళ్లీ తన కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ హరీష్ శంకర్.. డీజే ఇచ్చిన జోష్‌తో తన తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నాడు. డీజే సినిమాను నిర్మించిన దిల్ రాజునే ఈ సినిమాను కూడా నిర్మించనున్నాడు. మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు దిల్ రాజు ఇప్పటికే 'దాగుడు మూతలు' అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు స్వయంగా హరీష్ శంకరే మీడియాకు తెలిపాడు.
Samayam Telugu harish shankar to direct a multi starrer titled as dagudu moothalu
మల్టీస్టారర్ సినిమాని డైరెక్ట్ చేయనున్న హరీష్ శంకర్


ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో వున్న ఈ సినిమాకు ఇంకా నటీనటుల ఎంపిక పూర్తికాలేదు. కాకపోతే ప్రస్తుతం కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా వున్న ఇద్దరు యంగ్ స్టార్ హీరోలు ఇందులో కలిసి నటించనున్నట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు ఎవరనే వివరాల్ని మాత్రం హరీష్ శంకర్ గోప్యంగానే దాచిపెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.