‘‘మాఫియా అని పేరు పెట్టొచ్చు లేకపోతే ఇంకేదైనా పేరు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బాగా ఉన్నవాడు లేని వాడిని తొక్కుతున్నాడు’’ అని అంటున్నారు హీరో త్రిగుణ్ (Trigun) అలియాస్ అరుణ్ అదిత్ (Arun Adith). సిరి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై త్రిగుణ్, మేఘా ఆకాష్ (Megha Akash) హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ప్రేమ దేశం’ (Prema Desam). నవంబర్ 18న సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో హీరో త్రిగుణ్ సినీ ఇండస్ట్రీలో తమకు ఎదురైన ఇబ్బందికరమైన పరిస్థితుల గురించి ఘాటుగానే స్పందించారు.
‘‘‘ప్రేమ దేశం’ సినిమా చేయటానికి విజయవాడకి చెందిన నిర్మాత వచ్చారు. సినిమా చేస్తామని చెప్పి నాకు, మేఘా ఆకాష్కి అడ్వాన్సులు ఇచ్చారు. వారం రోజుల షూటింగ్ తర్వాత మేం సినిమా తీయటం లేదు.. మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి అన్నారు. అలా ఎందుకు అన్నారో మాకైతే అర్థం కాలేదు. సినిమా బాగా వస్తుంది కదా అనుకున్నాం. మణిశర్మగారికి సినిమాను చూపించాం. ఆయన చూసి మీరు ఇంత బాగా చేస్తారని అనుకోలేదన్నారు.
అసలేం జరిగిందంటే పెద్ద పాలిటిక్స్ జరిగింది. బయట నుంచి వచ్చేస్తున్నారా? వచ్చేస్తే ఎలా జరగనిస్తాం. మీ ఫైనాన్సియల్ ఆపించేస్తాం. మీ రిలీజ్లు ఆపించేస్తాం. థియేటర్స్ ఇవ్వం. ఓటీటీ అమ్మనివ్వం, పబ్లిసిటీ చేయనివ్వం అని అంటున్నారు. పబ్లిసిటీ చేయాలంటే డబ్బులు కావాలి. నేనేమో కోట్లు పెట్టుకుని రాలేదు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. గంగరాజుగారు ఓ అవకాశం ఇచ్చారు. ప్రకాష్ రాజ్ (Prakash Raj)గారు ఓ అవకాశం ఇచ్చారు. నాకు దొరికిన అవకాశం ఇంకొకరికి కూడా రావాలని చెప్పి ముందుకెళ్తున్నాం. కానీ ఆపించారు.
మన సంకల్పం బావుంటే మన్నలి ఎవరు ఆపలేరు. ఇది నిజం.. మా సినిమా షూటింగ్ను కూడా ఎవరూ ఆపలేకపోయారు. సినిమా షూటింగ్ను పూర్తి చేశాం. ఒకరు కాదు.. ఏకంగా నలుగురు ప్రొడ్యూసర్స్ వచ్చారు. బాగా ఉన్నవాడు లేనివాడ్ని తొక్కుతున్నాడు. ఏ రంగంలో అయినా ఇదే జరుగుతుంది. మనల్ని తొక్కడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ ఆపకూడదు అలా వెళ్లకపోతే ఆగిపోతాం’’ అన్నారు త్రిగుణ్.
ఈ చిత్రంలో అలనాటి అందాల తార మధుబాల ప్రత్యేక పాత్రలో నటించారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో శిరీష సిద్ధమ్ నిర్మించిన చిత్రం “ప్రేమదేశం”. మణిశర్మ సంగీతం అందించారు.
‘‘‘ప్రేమ దేశం’ సినిమా చేయటానికి విజయవాడకి చెందిన నిర్మాత వచ్చారు. సినిమా చేస్తామని చెప్పి నాకు, మేఘా ఆకాష్కి అడ్వాన్సులు ఇచ్చారు. వారం రోజుల షూటింగ్ తర్వాత మేం సినిమా తీయటం లేదు.. మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి అన్నారు. అలా ఎందుకు అన్నారో మాకైతే అర్థం కాలేదు. సినిమా బాగా వస్తుంది కదా అనుకున్నాం. మణిశర్మగారికి సినిమాను చూపించాం. ఆయన చూసి మీరు ఇంత బాగా చేస్తారని అనుకోలేదన్నారు.
అసలేం జరిగిందంటే పెద్ద పాలిటిక్స్ జరిగింది. బయట నుంచి వచ్చేస్తున్నారా? వచ్చేస్తే ఎలా జరగనిస్తాం. మీ ఫైనాన్సియల్ ఆపించేస్తాం. మీ రిలీజ్లు ఆపించేస్తాం. థియేటర్స్ ఇవ్వం. ఓటీటీ అమ్మనివ్వం, పబ్లిసిటీ చేయనివ్వం అని అంటున్నారు. పబ్లిసిటీ చేయాలంటే డబ్బులు కావాలి. నేనేమో కోట్లు పెట్టుకుని రాలేదు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. గంగరాజుగారు ఓ అవకాశం ఇచ్చారు. ప్రకాష్ రాజ్ (Prakash Raj)గారు ఓ అవకాశం ఇచ్చారు. నాకు దొరికిన అవకాశం ఇంకొకరికి కూడా రావాలని చెప్పి ముందుకెళ్తున్నాం. కానీ ఆపించారు.
మన సంకల్పం బావుంటే మన్నలి ఎవరు ఆపలేరు. ఇది నిజం.. మా సినిమా షూటింగ్ను కూడా ఎవరూ ఆపలేకపోయారు. సినిమా షూటింగ్ను పూర్తి చేశాం. ఒకరు కాదు.. ఏకంగా నలుగురు ప్రొడ్యూసర్స్ వచ్చారు. బాగా ఉన్నవాడు లేనివాడ్ని తొక్కుతున్నాడు. ఏ రంగంలో అయినా ఇదే జరుగుతుంది. మనల్ని తొక్కడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ ఆపకూడదు అలా వెళ్లకపోతే ఆగిపోతాం’’ అన్నారు త్రిగుణ్.
ఈ చిత్రంలో అలనాటి అందాల తార మధుబాల ప్రత్యేక పాత్రలో నటించారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో శిరీష సిద్ధమ్ నిర్మించిన చిత్రం “ప్రేమదేశం”. మణిశర్మ సంగీతం అందించారు.