యాప్నగరం

Naga Shourya: నాగశౌర్యతో సతీష్ వేగేశ్న.. ‘ఆల్ ఈజ్ వెల్’!

‘ఛలో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాగశౌర్య.. ఆ తరువాత వరుస పరాజయాలతో ఢీలా పడ్డారు. ఇక ‘శతమానం భవతం’ చిత్రంతో నేషనల్ అవార్డ్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో నిరుత్సాహపరిచారు.

Samayam Telugu 31 Jan 2019, 5:12 pm
‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ అవార్డ్‌ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు రెడీ అయ్యారు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన ‘శ్రీనివాస కళ్యాణం’ మూవీ నిరుత్సాహ పరచడంతో తిరిగి పూర్వ వైభవం అందుకునేందుకు ‘ఆల్ ఈజ్ వెల్’ అనే సాఫ్ట్ టైటిల్‌‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Samayam Telugu నాగశౌర్య


ఈ చిత్రంలో యంగ్ హీరో నాగశౌర్య‌ను ఎంపిక చేశారట దర్శకుడు. ‘ఛలో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాగశౌర్య వరస పరాజయాలతో ఢీలా పడ్డాడు. కణం, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల వంటి వరుస ఫ్లాప్ చిత్రాల నుండి ఉపశమనం పొంది సతీష్ వేగేశ్నతో ‘ఆల్ ఈజ్ వెల్’ అనిపించుకోవాలనుకుంటున్నాడట నాగ శౌర్య. మొత్తానికి దర్శకుడిగా సతీష్ వేగేశ్నకు.. హీరోగా నాగశౌర్యకు ఈ సినిమా కీలకం కానుంది. ఈ మూవీని ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా నిర్మించనున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.