యాప్నగరం

ఆ బాధ అనుభవిస్తున్న ప్రతీ ఒక్కరి తరఫున ఇది నా రిక్వెస్ట్: నిఖిల్ ఆసక్తికర ట్వీట్

గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఇంధనం ధరలు చుక్కలను తాకుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఆకాశాన్ని తాకుతుండటంతో.. మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. తాజా దీనిపై హీరో నిఖిల్ ట్వీట్ చేశారు.

Samayam Telugu 12 Jul 2021, 7:44 pm
అసలే కరోనా.. అందులో కొందరు ఉద్యోగాలు కోల్పోవడం.. కొందరికి ఉపాధి లేకుండా పోవడం.. ఇలా నానా కష్టాలు అనుభవిస్తుంటే.. మరోవైపు ప్రతీ రోజు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులపై మరింత భారాన్ని మోపుతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఓ మధ్య తరగతి వ్యక్తిని ఎంతో వేధిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. కొన్ని రోజుల క్రితం వరకూ అందుబాబులో ఉన్న లీటర్ పెట్రోల్ ధర.. ఇప్పుడు రూ.100ను దాటి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది.
Samayam Telugu నిఖిల్ సిద్ధార్త్
Nikhil Siddarth


మునుపెన్నడూ లేని విధంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనిపై చాలా మంది నిరసన తెలుపుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు ఉన్న సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తూ.. ఒక్కసారి ఓటర్లతో అవసరం తీరిపోయిన తర్వాత మళ్లీ ధరలు పెంచుతుంది అంటూ పలువురు విమర్శిస్తున్నారు. అయినప్పటికీ.. పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణలో మాత్రం కేంద్ర విఫలం అవుతోంది. కొన్ని రోజుల క్రితం వరకూ ప్రతీ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పోయింది. దీనిపై తాజాగా హీరో నిఖిల్ స్పందించారు.

‘అసలేం జరుగుతోంది. రూ.35 ఉండాల్సిన పెట్రోల్/డీజిల్ ధర పంపు వద్ద మాత్రం రూ.100గా ఉంటుంది. ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే టాక్సులను వెంటనే రద్దు చేయాలి. ఈ ధరల పెంపు వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతీ ఒక్కరి తరఫున ఇది నా విజ్ఞప్తి’ అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు. అందుకు అతను ఓ ఫోటో కూడా జత చేశాడు. చెట్టుకి ఉన్న పండు అందక ఎదురుచూస్తున్న వ్యక్తిగా ఈ ఫోటో అర్థం ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం నిఖిల్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది, ప్రభుత్వాలు ఇంధన ధరల విషయంలో మరోసారి సమీక్షించాలి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.