యాప్నగరం

హీరో రాజశేఖర్ ఇంట విషాదం

ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి ఆండాళ్ వరధరాజన్ హైదరాబాద్‌లో కన్నుమూశారు.

TNN 27 Sep 2017, 3:06 pm
ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి ఆండాళ్ వరధరాజన్ హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆమె వయసు 82 ఏళ్లు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆండాళ్‌.. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆరోగ్య పరిస్థితి బాగా విషమించడంతో హాస్పిటల్‌లోనే తుదిశ్వాస విడిచారు. ఆండాళ్‌కు రాజశేఖర్‌తో పాటు మరో ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆండాళ్‌కు రాజశేఖర్ రెండో కుమారుడు.
Samayam Telugu hero rajasekhars mother passes away
హీరో రాజశేఖర్ ఇంట విషాదం


ఆండాళ్ మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే స్నేహితులు, శ్రేయోభిలాషులు.. రాజశేఖర్‌ కుటుంబాన్ని పరామర్శించి, ఆండాళ్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజశేఖర్ తల్లి మృతి మంచు మనోజ్ సంతాపం వ్యక్తం చేశాడు. రాజశేఖర్ గారి తల్లి మరణ వార్త విని చాలా బాధపడ్డానని మనోజ్ ట్వీట్ చేశాడు. ఆమె మృతికి తన సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నానని, ఆమె ఆత్మకు శాంతి చేకూరలని కోరుకుంటున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నాడు.
Sad to hear the demise of @ActorRajasekhar garu's mother. My deepest condolences & more strength to the family. May her soul rest in peace🙏 pic.twitter.com/maJaWIvRk5 — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) September 27, 2017
కాగా, ఆండాళ్ భౌతికకాయాన్ని ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఆపోలో ఆస్పత్రిలోనే ఉంచనున్నారు. ఆ తరవాత చెన్నైకు తీసుకెళ్లి రేపు (గురువారం) అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజశేఖర్ స్వస్థలం తమిళనాడులోని థేని జిల్లా లక్ష్మీపురం. రాజశేఖర్ సినిమాల్లోకి వచ్చిన తరవాత చెన్నైలో స్థిరపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.