యాప్నగరం

సిట్టి చెల్లి కోసం 'చిట్టిబాబు' చేపల పులుసు

రంగస్థలం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రామ్‌చరణ్... ఖాళీ సమయంలో చెఫ్‌గా మారిపోతున్నాడు. మొన్నే చెర్రీ వంట చేస్తున్న ఫోటోలను భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

Samayam Telugu 14 May 2018, 9:04 pm
రంగస్థలం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రామ్‌చరణ్... ఖాళీ సమయంలో చెఫ్‌గా మారిపోతున్నాడు. మొన్నే చెర్రీ వంట చేస్తున్న ఫోటోలను భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. మళ్లీ చరణ్ తన చెల్లి కోసం గరిట పట్టాడు. ఆమె కోసం ఘుమఘుమలాడే వేడి వేడి చేపల పులుసును తయారు చేశాడు. ఇది నేను ఇంట్లో చేసిన ఫిష్ కర్రీ... నిహారిక కోసం స్పెషల్‌గా చేశానని ఓసారి టేస్ట్ చూశాడు. అదిరిపోయిందంటూ ఆ రుచిని ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Samayam Telugu Ram Charan


సోషల్ మీడియాలో ఈ వీడియోకు మంచి క్రేజ్ వస్తోంది. రామ్ చరణ్ వీడియోను ఫ్యాన్స్ షేర్ చేస్తూ... అన్నయ్యకు చెల్లిపైన ఎంత ప్రేమోనంటూ మురిసిపోతున్నారు. చెర్రీ ఇలా ఇంట్లో వాళ్లతో సరదాగా గడుపుతూనే... తన వంటల రుచిని చూపిస్తున్నాడు. ఆ ఆనందాన్ని అభిమానులతో కూడా పంచుకుంటున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.