చాలా ఏళ్ల తరువాత మళ్లీ సినిమా వేదికపై కనిపించి సందడి చేశారు హీరో శివాజీ. ఏపీ పాలిటిక్స్తో బిజీగా మారి సినిమాలకు దూరమైన శివాజీ.. ‘అల్లూరి’ టీజర్ లాంచ్ ఈవెంట్లో కనిపించారు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా నటించిన తాజా చిత్రం ‘అల్లూరి’ (Alluri). సోమవారం (జూలై 04) అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ‘అల్లూరి’ టీజర్ను చిత్రం బృందం విడుదల చేసింది. లక్కీ మీడియా బ్యానర్పై బెక్కెం వేణుగోపాల్ (Bekkem Venugopal) నిర్మించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించారు.
ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్లో పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘అల్లూరి’ (Alluri Movie) అంటే మాకు సూపర్ స్టార్ కృష్ణగారు గుర్తుకువస్తారు. ప్రతి భారతీయుడిలో దేశభక్తిని రగిల్చిన చిత్రం అది. నిజంగానే అల్లూరి సీతారామరాజు అంటే ఇలాగే ఉంటారా? అనేట్టుగా చేశారాయన. అల్లూరి సినిమా నిర్మాత గోపి (బెక్కెం వేణుగోపాల్) చాలామందిని పరిచయం చేశారు కానీ.. నేను గోపీని పరిచయం చేశానని చాలా గర్వంగా చెప్తాను ఆ మాట. ఎందుకంటే గోపీ సినిమా మీద సూపర్ స్టార్ క్రిష్ణగారి మీద అభిమానంతో అచ్చెంపేట నుంచి హైదరాబాద్ వచ్చారు.
అనుకోకుండా ఓ చీకటి రోజున నన్ను కలిశాడు.. నేను కూడా ఆరోజున చీకటిలోనే ఉన్నాం.. చీకటి నుంచి వెలుగులోకి వచ్చాం. నాకు ప్రతికథ చెప్తాడు. అలా నాకు చెప్పిన కథల్లో కొన్ని వద్దన్నాను. అలా నేను వద్దని చెప్పిన కథని చేశాడు.. ఆ సినిమా మిస్ ఫైర్ అయ్యింది.
ఇప్పుడు నాకు ‘అల్లూరి’ కథను చెప్పాడు.. ధైర్యంగా గుండెలపై చేయి వేసుకుని ఈ సినిమా చేయొచ్చని చెప్పాను. అంత అద్భుతంగా ఈ సినిమా కథను తయారు చేశారు దర్శకుడు.
విష్ణు సినిమా చేస్తున్నానంటే.. కొత్తదనం ఆశిస్తారు.. రేపటి రోజున ఈ సినిమా చూసినప్పుడు కొత్త అనుభూతి కలుగుతుంది. పోలీస్ కథలు చాలా వరకూ సక్సెస్ అవుతాయి. మనల్ని మనం సినిమాలో ఊహించుకుంటాం కాబట్టే.. సినిమాలు ఇంకా బతికి ఉన్నాయి.. బతికే ఉంటాయి. ఈ అల్లూరి సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది.
అల్లూరి జయంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ని రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అదే సందర్భంలో బాధ కూడా ఉంది. ఆరోజున అల్లూరిని తెల్లదొరలు చంపినప్పుడు చాలా బాధపడ్డాం.. ఆ తెల్లదొరలు నల్లదొరలుగా మారి ఈ దేశంలో ఇంకా ఉన్నారని నా అభిప్రాయం.
సమజాన్ని నెక్స్ట్ లెవల్కి తీసుకువెళ్లాల్సింది పోయి.. పాతాళానికి తొక్కేస్తున్నారు. ఈ వేదికపై రాజకీయాలు మాట్లాడటం నాకు ఇష్టం లేదు కానీ.. అల్లూరి పేరు గుర్తుకు వచ్చినప్పుడు ఇలాంటివి గుర్తుకు వస్తాయి. ఇలాంటి భావనలతోనే నేను సినిమాలకు దూరం అయ్యారు. నా కెరియర్లో చివరి సినిమా ‘బూచమ్మా బూచాడు’.. నాకు కెరియర్ ఉన్నా కూడా.. పాలెం బస్సు సంఘటన నన్ను సినిమా నుంచి దూరంగా తీసుకుని వెళ్లింది. హ్యాపీగా నా సినిమాలు నేను చేసుకుని ఉంటే.. ఎంత వరస్ట్ సినిమాలు తీసినా.. తక్కువలో తక్కువ 10-15 సినిమాలు తీసేవాడిని. కానీ నేను వాటి కోసం ఆలోచించలేదు. ఈనాటికీ కూడా మన భారతదేశం పాలెం బస్సు దగ్గరే ఆగిపోయింది. ఇది మారాలి.. అల్లూరిని ఫొటోలలో చూసుకోవడం కాదు.. మీ పిల్లలకు ఏం ఇవ్వాలో అల్లూరి చూసి నేర్చుకోవాలి.. మనలో స్వార్ధం పెరిగిపోతుంది. ఈ అల్లూరి సినిమా ఎంతో మందికి కనువిప్పు కావాలని కోరుతున్నా’ అంటూ స్పీచ్ ముగించారు హీరో శివాజీ.
ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్లో పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘అల్లూరి’ (Alluri Movie) అంటే మాకు సూపర్ స్టార్ కృష్ణగారు గుర్తుకువస్తారు. ప్రతి భారతీయుడిలో దేశభక్తిని రగిల్చిన చిత్రం అది. నిజంగానే అల్లూరి సీతారామరాజు అంటే ఇలాగే ఉంటారా? అనేట్టుగా చేశారాయన. అల్లూరి సినిమా నిర్మాత గోపి (బెక్కెం వేణుగోపాల్) చాలామందిని పరిచయం చేశారు కానీ.. నేను గోపీని పరిచయం చేశానని చాలా గర్వంగా చెప్తాను ఆ మాట. ఎందుకంటే గోపీ సినిమా మీద సూపర్ స్టార్ క్రిష్ణగారి మీద అభిమానంతో అచ్చెంపేట నుంచి హైదరాబాద్ వచ్చారు.
అనుకోకుండా ఓ చీకటి రోజున నన్ను కలిశాడు.. నేను కూడా ఆరోజున చీకటిలోనే ఉన్నాం.. చీకటి నుంచి వెలుగులోకి వచ్చాం. నాకు ప్రతికథ చెప్తాడు. అలా నాకు చెప్పిన కథల్లో కొన్ని వద్దన్నాను. అలా నేను వద్దని చెప్పిన కథని చేశాడు.. ఆ సినిమా మిస్ ఫైర్ అయ్యింది.
ఇప్పుడు నాకు ‘అల్లూరి’ కథను చెప్పాడు.. ధైర్యంగా గుండెలపై చేయి వేసుకుని ఈ సినిమా చేయొచ్చని చెప్పాను. అంత అద్భుతంగా ఈ సినిమా కథను తయారు చేశారు దర్శకుడు.
విష్ణు సినిమా చేస్తున్నానంటే.. కొత్తదనం ఆశిస్తారు.. రేపటి రోజున ఈ సినిమా చూసినప్పుడు కొత్త అనుభూతి కలుగుతుంది. పోలీస్ కథలు చాలా వరకూ సక్సెస్ అవుతాయి. మనల్ని మనం సినిమాలో ఊహించుకుంటాం కాబట్టే.. సినిమాలు ఇంకా బతికి ఉన్నాయి.. బతికే ఉంటాయి. ఈ అల్లూరి సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది.
అల్లూరి జయంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ని రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అదే సందర్భంలో బాధ కూడా ఉంది. ఆరోజున అల్లూరిని తెల్లదొరలు చంపినప్పుడు చాలా బాధపడ్డాం.. ఆ తెల్లదొరలు నల్లదొరలుగా మారి ఈ దేశంలో ఇంకా ఉన్నారని నా అభిప్రాయం.
సమజాన్ని నెక్స్ట్ లెవల్కి తీసుకువెళ్లాల్సింది పోయి.. పాతాళానికి తొక్కేస్తున్నారు. ఈ వేదికపై రాజకీయాలు మాట్లాడటం నాకు ఇష్టం లేదు కానీ.. అల్లూరి పేరు గుర్తుకు వచ్చినప్పుడు ఇలాంటివి గుర్తుకు వస్తాయి. ఇలాంటి భావనలతోనే నేను సినిమాలకు దూరం అయ్యారు. నా కెరియర్లో చివరి సినిమా ‘బూచమ్మా బూచాడు’.. నాకు కెరియర్ ఉన్నా కూడా.. పాలెం బస్సు సంఘటన నన్ను సినిమా నుంచి దూరంగా తీసుకుని వెళ్లింది. హ్యాపీగా నా సినిమాలు నేను చేసుకుని ఉంటే.. ఎంత వరస్ట్ సినిమాలు తీసినా.. తక్కువలో తక్కువ 10-15 సినిమాలు తీసేవాడిని. కానీ నేను వాటి కోసం ఆలోచించలేదు. ఈనాటికీ కూడా మన భారతదేశం పాలెం బస్సు దగ్గరే ఆగిపోయింది. ఇది మారాలి.. అల్లూరిని ఫొటోలలో చూసుకోవడం కాదు.. మీ పిల్లలకు ఏం ఇవ్వాలో అల్లూరి చూసి నేర్చుకోవాలి.. మనలో స్వార్ధం పెరిగిపోతుంది. ఈ అల్లూరి సినిమా ఎంతో మందికి కనువిప్పు కావాలని కోరుతున్నా’ అంటూ స్పీచ్ ముగించారు హీరో శివాజీ.