యాప్నగరం

కేరళ వరదలు: హీరో సిద్దార్థ్ 'కేరళ డొనేషన్ ఛాలెంజ్'..

కేరళను ఆదుకోవాలంటే కేవలం డొనేషన్ చేయమని చెప్తే సరిపోదని.. దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళితేనే మరింత ప్రయోజనం ఉంటుందని భావించిన హీరో సిద్దార్ధ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 'కేరళ డొనేషన్ ఛాలెంజ్'ను ప్రారంభించాడు.

Samayam Telugu 17 Aug 2018, 1:50 pm
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఇప్పటికే కోలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు తమ విరాళాలను ప్రకటించారు. ఇంకా ప్రకటిస్తూనే ఉన్నారు కూడా. కేరళను ఆదుకోవాలంటే కేవలం డొనేషన్ చేయమని చెప్తే సరిపోదని.. దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళితేనే మరింత ప్రయోజనం ఉంటుందని భావించిన హీరో సిద్దార్ధ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 'కేరళ డొనేషన్ ఛాలెంజ్'ను ప్రారంభించాడు. ట్విట్టర్ ద్వారా సిద్ధార్థ్ ఈ ఛాలెంజ్‌ విషయాన్ని తెలిపాడు. తను చెల్లించిన రూ.10 లక్షల విరాళానికి సంబంధించిన బ్యాంకు కాపీని కూడా పోస్టుకు జతచేశాడు.
Samayam Telugu siddarth


కేరళలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా.. ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా మరణించారు. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం (ఆగస్టు 16) దేశ ప్రజలను అభ్యర్థించారు. ప్రముఖులు విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావాలని కోరారు.

10లక్షల విరాళం ప్రకటించిన ధనుష్రజినీకాంత్ అల్లుడు ధనుష్ కేరళ బాధితుల కోసం రూ.15 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించాడు. మానవత్వంతో కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.