యాప్నగరం

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగమైన దిగాంగనా సూర్యవంశీ.. బాధ్యతగా అందరూ మొక్కలు నాటాలని పిలుపు

యంగ్ హీరోయిన్ దిగాంగనా సూర్యవంశీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగమైంది. ఈ మేరకు ముంబైలోని తన నివాసంలో మొక్కలు నాటి ఇది చాలా మంచి కార్యక్రమం అని పొగిడింది.

Samayam Telugu 19 Jul 2020, 11:07 am
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతోంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగమవుతున్నారు. పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు ఎవరికి వారు పెద్దఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ భావితరాలకు మెరుగైన వాతావరణం ప్రసాదించడంలో అంతా భాగం కావాలని పిలుపునిస్తున్నారు.
Samayam Telugu గ్రీన్ ఇండియా ఛాలెంజ్_లో భాగమైన దిగాంగనా సూర్యవంశీ
Digangana Suryavanshi


ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి తన వంతుగా మొక్కలు నాటింది హీరోయిన్ దిగాంగనా సూర్యవంశీ. ముంబైలోని తన నివాసంలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అని, ఈ ఛాలెంజ్ లోకి తనను ఆహ్వానించిన దర్శకుడు సంపత్ నందికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపింది. ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొని బాధత్యగా మొక్కలు నాటాలని ట్విట్టర్ ఖాతాలో తన అభిప్రాయాన్ని పంచుకుంది.

Also Read: షాకింగ్: స్టార్ హీరో ఇంట్లో బాంబు కలకలం.. ఎంటరైన పోలీసులు! ఏం జరిగిందంటే..

టీవీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన దిగాంగనా సూర్యవంశీ.. వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పటికే హిందీ, తమిళ, తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ‘సీటిమార్’ సినిమాలో టీవీ రిపోర్టర్‌గా నటిస్తోంది. సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.