యాప్నగరం

పూజా హెగ్డే.. ఆ ముగ్గుర్ని ఆకాశానికి ఎత్తేసిందిగా!

అల్లు అర్జున్‌తో కలిసి దువ్వాడ జగన్నాథం లాంటి కమర్షియల్ హిట్ అందుకున్న పూజా హెగ్డేకు వరుసబెట్టి ఆఫర్లు వస్తున్నాయి.

Samayam Telugu 17 Mar 2018, 11:49 am
అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథంలో నటించిన పుజా హెగ్డే వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రభాస్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న ఆమె.. మహేశ్ బాబు, ఎన్టీఆర్‌లతోనూ సినిమాలు చేయనుంది. ‘డీజే’ హిట్ కావడంతో.. ఆ మూవీలో తన అందం, అభినయంతో మెప్పించిన పుజా హెగ్డేకు ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. ఇటీవల మీడియాతో ముచ్చటించిన ఆమె గతంలోనూ తనకు దక్షిణాదిన ఆఫర్లు వచ్చాయని తెలిపింది.
Samayam Telugu heroine pooja hegde praises telugu heros and compare them with khan trio
పూజా హెగ్డే.. ఆ ముగ్గుర్ని ఆకాశానికి ఎత్తేసిందిగా!


కానీ హృతిక్ సరసన మొహెంజోదారో సినిమాతో బిజీగా ఉండటంతో కుదరలేదని పూజా తెలిపింది. తెలుగులో ప్రభాస్, మహేష్, తారక్ సరసన నటించడం ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఈ ముగ్గురిని బాలీవుడ్‌లోని ఖాన్ త్రయంతో పోల్చింది. ఈ ముగ్గురు నటులు తెలుగులో షారుక్, సల్మాన్, అమీర్‌ ఖాన్ లాంటి వారంటూ ఆకాశానికి ఎత్తేసింది.

ప్రభాస్‌తో పూజా హెగ్డే సినిమా విషయానికి వస్తే.. అది రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రెండు భాషల్లో తెరకెక్కనుంది. యూవీ క్రియేషన్ బ్యానర్‌లో రాధాకృష్ణ కుమార్ దీన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటి వరకూ నేను ప్రభాస్‌ను కలవలేదు. కానీ ఆయనతో కలిసి వెండితెరను పంచుకోనుండటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. పూజా హెగ్డే మాట తీరు చూస్తుంటే.. అతి త్వరలోనే ఆమె తెలుగులో టాప్ పొజిషన్‌కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే సినీ పరిశ్రమలో రాణించాలంటే.. అందం, అభినయమే కాదు.. మాటతీరు కూడా ఎంతో ముఖ్యం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.