యాప్నగరం

మూవీ లవర్స్‌కి షాక్... టికెట్ రేట్ల పెంపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సంక్రాంతి సీజన్‌కు ముందే సినిమా టికెట్ రేట్లు పెరగనున్నాయి. రెండు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడానికి థియేటర్లకు అనుమతినిస్తూ ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

TNN 5 Jan 2018, 4:42 pm
సంక్రాంతి సీజన్‌కు ముందే సినిమా టికెట్ రేట్లు పెరగనున్నాయి. రెండు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడానికి థియేటర్లకు అనుమతినిస్తూ ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాబోయే సంక్రాంతి సీజన్లో టికెట్ల ధరలను ప్రస్తుతం ఉన్న మొత్తానికన్నా ఎక్కువ చేసుకునేందుకు అనుమతివ్వాలని ఏపి, తెలంగాణలోని కొన్ని థియేటర్లు వేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిశీలించి, ధరలను పెంచుకోవచ్చంటూ అనుమతినిచ్చింది. అయితే పెంచుకున్న ధరలకు అనుగుణంగా తగిన నిష్పత్తిలో పన్ను చెల్లించాలని పేర్కొంది. టికెట్ల ధరల సమాచారం సంబంధిత యంత్రాంగానికి ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేసి మార్గదర్శకాలు రూపొందించేదాకా ఈ ధరలను పెంచుకోవచ్చని స్పష్టం చేసింది.
Samayam Telugu high court allows cinema halls in telangana and andhra pradesh to hike ticket rates
మూవీ లవర్స్‌కి షాక్... టికెట్ రేట్ల పెంపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్


ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసింది. ఈమేరకు జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ ఉత్తర్వులు వెలువరించారు. ఈ మేరకు గతంలో తమ థియేటర్లలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు కోరుతూ ప్రభుత్వాలను కోరినప్పకీ.. ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ధరలను పెంచుకోవడానికి అనుమతించాలంటూ పలు థియేటర్లు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ సీజన్లో వచ్చే సినిమాల ప్రదర్శనకు ఎక్కువ మొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సి వస్తోందని, అందుకే ధరల పెంపు కోరుతున్నామని థియేటర్ యాజమాన్యాలు వ్యాజ్యం దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో దాఖలైన పలు పిటిషన్‌లపై జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ విచారణ చేపట్టి కమిటీలను ఏర్పాటు చేసి మార్గదర్శకాలు రూపొందించని కారణంగా టికెట్ల ధరలను పెంచుకోవడానికి థియేటర్లకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక సంక్రాంతి సీజన్ వస్తుందంటే సినీ అభిమానులకు పండగనే చెప్పాలి. ఈ పండగ బరిలో నిలిచి గెలిచేందుకు ఒకదానితో ఒకటి పోటీపడుతుందటంతో ఈ బాక్సాఫీస్ వార్‌ను సినీ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ పండగ సీజన్‌లో అజ్ఞాతవాసి, జై సింహా, రంగుల రాట్నం, గ్యాంగ్ చిత్రాలు ఉండటంతో సినిమా పండుగ వస్తుందనే చెప్పాలి. అయితే ఈ పండగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు గట్టి ప్రయత్నాలే చేస్తుంటారు. టికెట్ రేట్లను విపరీతంగా పెంచేసి ప్రేక్షకుల జేబులకు చిల్లు పెట్టేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటారు. తాజాగా కోర్టు నుండి కూడా తమకు అనుకూలమైన ఉత్తర్వులు రావడంతో టికెట్స్ రేట్లు మరింత పెరగడం ఖాయమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.