యాప్నగరం

బాలకృష్ణ పెద్ద మనసు.. టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ.

Samayam Telugu 1 Oct 2020, 5:33 pm
హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఆ కార్యకర్త కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
Samayam Telugu బాలకృష్ణ
Balakrishna


అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడూరు కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్త నర్సింహప్ప మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ.. నర్సింహప్ప కుటుంబానికి రూ.1 .5 లక్షల ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. బాలకృష్ణ ఆదేశాలతో స్థానిక నాయకులు బాధితుని ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే అందించిన రూ.1 .5 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాండును కుటుంబ సభ్యులకు అందజేశారు.

నర్సింహప్ప కుటుంబ సభ్యులకు ఫోన్‌లో పరామర్శ

అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను ఫోనులో పరామర్శించిన నందమూరి బాలకృష్ణ వారికి మనోధైర్యాన్ని అందించారు. అలాగే పిల్లలను బాగా చదివించుకోవాలని అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని అభయమిచ్చారు. అదే విధంగా స్థానిక టీడీపీ నాయకులు ఆ కుటుంబానికి తమ వంతుగా ఆర్థిక సహాయం అందించారు. తమకు అండగా నిలిచిన నందమూరి బాలకృష్ణకి, స్టానిక టీడీపీ నాయకులకు నర్సింహప్ప కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.