యాప్నగరం

కరోనాతో ఇండస్ట్రీలో మరో విషాదం.. వైరస్ సోకి మరో ప్రముఖుడు కన్నుమూత

రెండో దశలో కరోనా వైరస్ చాలా మంది సినీ ప్రముఖులను బలిగొంటోంది. తాజాగా కరోనా వైరస్ సోకి ప్రముఖ గాయకుడు, హెచ్‌.ఎం.వీ సంస్థ ప్రధాన సలహాదారు మంగళంపతి కన్నుమూశారు.

Samayam Telugu 13 May 2021, 2:58 pm
రెండో దశలో కరోనా మహమ్మారి భయానకంగా వ్యాపిస్తోంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నారు. ఈసారి కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీపై తీవ్రంగానే ఉంది. ఇప్పటికే వైరస్ సోకి పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ప్రముఖ గ్రామ్‌ఫోన్ రికార్డుల సంస్థ ‘హెచ్.ఎం.వీ’తో సుదీర్ఘమైన అనుభవం ఉన్న మంగళంపతి(92) కరోనా వైరస్ సోకి తుదిశ్వాస విడిచారు.
Samayam Telugu మంగళంపతి
Mangalampathi


అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల క్రితం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన మంగళవారం రాత్రి మృతి చెందారు. మొదటి నుంచి సంగీతం, సాహిత్యం అంటే మంగళంపతికి మక్కువ ఉండేది. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా రాణించాలని ఆయన తాపత్రేయపడేవారు. తిరుపతిలో జన్మించిన ఆయన హెచ్.ఎమ్.వి. సంస్థ దక్షిణాది విభాగానికి ఆయన అధిపతిగా.. ప్రధాన సలహాదారుడిగా సేవలను అందించారు. ఈ రంగంలోకి రాక ముందు ఆయన టీటీడీలోను .. రైల్వే శాఖలోను పనిచేశారు.

ఇక హెచ్‌.ఎం.వీ సంస్థలో చేరిన తర్వాత ఆయన ఎంతో మంది గాయకులను, సంగీత దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ముఖ్యంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటసాలతో ‘భగవద్గీత’, ఎంఎస్ సుబ్బులక్ష్మీతో ‘అన్నమయ్య కీర్తనలు’ పడించిన ఘనత మంగళంపతికే దక్కింది. ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా.. ‘‘ఎన్ని సినిమాలు నిర్మించినా.. ఎన్ని పాటలు రికార్డు చేసినా.. ఘంటసాలతో పాడించిన భగవద్గీతకు ఏవీ సరితూగవు’’ అంటూ ఆయన చెప్పేవారు. మంగళంపతి మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.