డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని వ్యక్తుల జాబితాలో కెమెరామెన్ శ్యామ్ కే నాయడు ఉన్నట్లు మీడియాలో వార్తలు రావడంపై ఆయన స్పందించారు. మాదక ద్రవ్యాల కేసులో తనకు కూడా నోటీసులు జారీ చేశారంటూ మీడియాలో రావడం షాకింగ్గా ఉందని శ్యామ్ కే నాయుడు అన్నారు. అసలు తాను ఎక్కువగా బయట కూడా కనిపించనని, డ్రగ్స్ అలవాటు కూడా తనకు లేదని తెలిపారు. ఈ దుష్ప్రచారంతో తన కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అయితే ఎక్సైజ్ శాఖ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని వెల్లడించారు. మరోవైపు, నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులంతా తమకు డ్రగ్స్ అలవాటు లేదని వెల్లడించారు. కొందరైతే తాము ఎలాంటి తప్పు చేయలేదని, విచారణకు హాజరై నిజాయితీని నిరూపించుకుంటామని అంటున్నారు.
మరోవైపు కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలతో మొదలుపెట్టి.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో డ్రగ్ మాఫియా పునాదులు పెకిలిస్తున్న ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ పది రోజల పాటు సెలవుపై వెళ్తున్నారు. మాదకద్రవ్యాల కేసు సినీ పరిశ్రమను ఓ కుదుపు కుదుపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సెలవుపై వెళ్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. డ్రగ్స్ మాఫియా ఆటకట్టిస్తోన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఇంతటి కీలక సమయంలో సెలవుపై వెళ్లడానికి ఆయనపై పెరుగుతున్న ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. ఈనెల 16 నుంచి 27 వరకు సెలవు తీసుకుంటున్న ఆయన హైదరాబాద్లో ఉండబోవటం లేదు.
మరోవైపు కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలతో మొదలుపెట్టి.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో డ్రగ్ మాఫియా పునాదులు పెకిలిస్తున్న ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ పది రోజల పాటు సెలవుపై వెళ్తున్నారు. మాదకద్రవ్యాల కేసు సినీ పరిశ్రమను ఓ కుదుపు కుదుపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సెలవుపై వెళ్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. డ్రగ్స్ మాఫియా ఆటకట్టిస్తోన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఇంతటి కీలక సమయంలో సెలవుపై వెళ్లడానికి ఆయనపై పెరుగుతున్న ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. ఈనెల 16 నుంచి 27 వరకు సెలవు తీసుకుంటున్న ఆయన హైదరాబాద్లో ఉండబోవటం లేదు.