యాప్నగరం

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు: శ్యామ్ కే నాయుడు

డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని వ్యక్తుల జాబితాలో కెమెరామెన్ శ్యామ్ కే నాయడు ఉన్నట్లు మీడియాలో వార్తలు రావడంపై ఆయన స్పందించారు.

TNN 14 Jul 2017, 3:31 pm
డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని వ్యక్తుల జాబితాలో కెమెరామెన్ శ్యామ్ కే నాయడు ఉన్నట్లు మీడియాలో వార్తలు రావడంపై ఆయన స్పందించారు. మాదక ద్రవ్యాల కేసులో తనకు కూడా నోటీసులు జారీ చేశారంటూ మీడియాలో రావడం షాకింగ్‌గా ఉందని శ్యామ్ కే నాయుడు అన్నారు. అసలు తాను ఎక్కువగా బయట కూడా కనిపించనని, డ్రగ్స్ అలవాటు కూడా తనకు లేదని తెలిపారు. ఈ దుష్ప్రచారంతో తన కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అయితే ఎక్సైజ్ శాఖ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని వెల్లడించారు. మరోవైపు, నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులంతా తమకు డ్రగ్స్ అలవాటు లేదని వెల్లడించారు. కొందరైతే తాము ఎలాంటి తప్పు చేయలేదని, విచారణకు హాజరై నిజాయితీని నిరూపించుకుంటామని అంటున్నారు.
Samayam Telugu hyderabad drugs scandal cameraman shyam k naidu respond his involvement
నాకు ఎలాంటి నోటీసులు రాలేదు: శ్యామ్ కే నాయుడు


మరోవైపు కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలతో మొదలుపెట్టి.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో డ్రగ్ మాఫియా పునాదులు పెకిలిస్తున్న ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ పది రోజల పాటు సెలవుపై వెళ్తున్నారు. మాదకద్రవ్యాల కేసు సినీ పరిశ్రమను ఓ కుదుపు కుదుపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సెలవుపై వెళ్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. డ్రగ్స్ మాఫియా ఆటకట్టిస్తోన్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఇంతటి కీలక సమయంలో సెలవుపై వెళ్లడానికి ఆయనపై పెరుగుతున్న ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. ఈనెల 16 నుంచి 27 వ‌ర‌కు సెలవు తీసుకుంటున్న ఆయన హైదరాబాద్‌లో ఉండబోవటం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.