యాప్నగరం

వేదాంతం వల్లిస్తోన్న చార్మీ

టాలీవుడ్‌లో మాదక ద్రవ్యాల వాడుతున్న వ్యక్తుల జాబితాలో ఆమె పేరు వినిపిస్తున్న వేళ, ఇన్‌స్టాగ్రామ్‌లో చార్మి పెట్టిన ఒక పోస్ట్ గురించి నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు

TNN 14 Jul 2017, 2:51 pm
డ్రగ్స్ కేసులో ఆరోపణలతో నోటీసులు అందుకున్న హీరోయిన్ చార్మీ వేదాంతం వళ్లిస్తోంది. టాలీవుడ్‌లో మాదక ద్రవ్యాల వాడుతున్న వ్యక్తుల జాబితాలో ఆమె పేరు వినిపిస్తున్న వేళ, ఇన్‌స్టాగ్రామ్‌లో చార్మి పెట్టిన ఓ పోస్ట్ గురించి నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. "నీ చుట్టూ ఉండేవారు హేళన చేస్తూ చిన్న బుచ్చినా బాధ పడకు. వారలా చేస్తున్నారంటే, కేవలం నీ ధైర్యాన్ని దెబ్బతీయడానికి మాత్రమే. వారికన్నా గొప్పగా నువ్వు ఆలోచిస్తున్నావన్న భావన ఉంటేనా ఇలా అవమానిస్తుంటారని పోస్టు పెట్టిందీ బొద్దుగుమ్మ. దీన్ని చూసిన వారు, తనను తాను నిర్దోషిగా చెప్పుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ పోస్టు పెట్టిందని కొందరు, ఇప్పుడీ వేదాంతపు మాటలు ఎందుకోనని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Samayam Telugu hyderabad drugs scandal police notice to heroine charmy
వేదాంతం వల్లిస్తోన్న చార్మీ


  A post shared by Charmmekaur (@charmmekaur) on Jul 13, 2017 at 8:59am PDT
టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోన్న డ్రగ్స్ కేసులో ఇప్పటికే 19 మంది సినీ ప్రముఖులకు సిట్ నోటీసులు జారీ చేసింది. స్వయంగా వీరు సిట్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నెల 19 నుంచి 27 లోపు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. నోటీసులు అందుకున్నవారి జాబితాలో మాస్ మహరాజ్ రవితేజ, దర్శకుడు పూరీ జగన్నాథ్, యువ నటులు తరుణ్, నవదీప్, తనీష్‌తోపాటు చార్మి, సుబ్బరాజు, గీతా మాధురి భర్త నందు ఉన్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పేర్లు బయట పడటం పట్ల ఎక్సైజ్ డీఐజీ అకున్ సబర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సీనీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశాం తప్ప, ఎవరి పేర్లూ బయటకు వెల్లడించలేదని అన్నారు. నోటీసులు జారీ అయిన వారిలో ప్రముఖులు కూడా ఉండటంతో ఎక్సైజ్ అధికారులపై తీవ్ర ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.