క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో ఇండస్ట్రీ పరువు తీసే విధంగా మీడియాలో జరిగిన రాద్దాంతంపై పవన్ కల్యాణ్ శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్కు వెళ్లారు. ఆయన అండగా మెగా ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్లింది. పవర్ స్టార్ ఫిల్మ్ ఛాంబర్కి చేరుకోగానే పెద్ద ఎత్తున ఆయన అభిమానులు అక్కడకు చేరుకున్నారు. జనసేనానిపై కుట్ర పూరిత కథనాలను ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ.. మీడియా ఛానల్స్కు చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఐదుగురు అభిమానులపై కేసు నమోదైంది.
‘పవన్ కల్యాణ్ మీ ఫ్యాన్స్కు సాయం చేయండి. ఈసారి పారిపోకండి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చెందిన వాహనాలను ధ్వంసం చేసిన ఐదుగుర్ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లంతా తాము జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ అభిమానులమని చెప్పారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించార’ని కత్తి ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్కు రాంగోపాల్ వర్మ సెటైరికల్గా స్పందించాడు. అరెస్టయిన వారికి అండగా ఉండటానికి.. పవన్ మెగా ఫ్యామిలీతో కలిసి ఫిల్మ్ ఛాంబర్కు వెళ్లినట్టుగానే ఇప్పుడు మరోసారి పోలీస్ స్టేషన్కు వెళ్లాలి.
‘పవన్ కల్యాణ్ మీ ఫ్యాన్స్కు సాయం చేయండి. ఈసారి పారిపోకండి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చెందిన వాహనాలను ధ్వంసం చేసిన ఐదుగుర్ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లంతా తాము జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ అభిమానులమని చెప్పారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించార’ని కత్తి ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్కు రాంగోపాల్ వర్మ సెటైరికల్గా స్పందించాడు. అరెస్టయిన వారికి అండగా ఉండటానికి.. పవన్ మెగా ఫ్యామిలీతో కలిసి ఫిల్మ్ ఛాంబర్కు వెళ్లినట్టుగానే ఇప్పుడు మరోసారి పోలీస్ స్టేషన్కు వెళ్లాలి.