యాప్నగరం

చార్మీ, సుబ్బరాజులకు డ్రగ్స్ ఇచ్చింది పూరీనే!

తీగలాగితే డొంక కదలినట్లు డ్రగ్స్ రాకెట్‌లో లోతుకు వెళ్లేకొద్దీ ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

TNN 14 Jul 2017, 12:01 pm
తీగలాగితే డొంక కదలినట్లు డ్రగ్స్ రాకెట్‌లో లోతుకు వెళ్లేకొద్దీ ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కలకలం రేపుతున్న డ్రగ్స్ దందాకు సంబంధించి మరిన్ని వివరాలను సిట్ కార్యాలయంలోని తమకు పరిచయస్తుల ద్వారా తెలుగు న్యూస్ ఛానళ్లు సేకరించి, బహిర్గతం చేస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు, తొలుత అరెస్ట్ అయిన కెల్విన్ నుంచి దర్శకుడు పూరీ జగన్నాథ్ స్వయంగా మత్తు పదార్థాలను కొనుగోలు చేసినట్లు పోలీసుల ధ్రువీకరించారు. పూరీ జగన్నాథ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించగా, ఆయన నుంచి హీరోయిన్ చార్మీ, క్యారెక్టర్ నటుడు సుబ్బరాజులకు అందినట్లు కూడా పోలీసులు గుర్తించారు.
Samayam Telugu hyderbad drugs rocket director puri jagannath and charmi subbaraju
చార్మీ, సుబ్బరాజులకు డ్రగ్స్ ఇచ్చింది పూరీనే!


ఇక జీశాన్ అనే నైజీరియన్ నుంచి హీరో రవితేజకు పలుమార్లు డ్రగ్స్ వెళ్లాయని సిట్ అధికారులు నిర్ధరించారు. ఈ నిర్దరణ తర్వాతే రవితేజకు నోటీసులు పంపాలని నిర్ణయించారు. ఈ కేసులో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన మరి కొందరు ప్రముఖుల పేర్లు ఉన్నట్టు వార్తలు వెలువడతున్న సంగతి తెలిసిందే. ఇక సినీ ప్రముఖుల్లో మిగిలిన వారికి నోటీసులు ఇచ్చేందుకు సిట్ రెండో జాబితాను సిద్ధం చేస్తోంది. డ్రగ్స్ దందాలో 40 మంది టాలీవుడ్‌ సంబంధించిన ప్రముఖుల పేర్లు ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ సహా పలువురి కాల్ డేటాలో వీరందరి నంబర్లు ఉన్నాయి. వారి ఫోన్ల నుంచి సినీ ప్రముఖులకు, సినీ ప్రముఖుల నుంచి వారికి కాల్స్ వెళ్లాయి. డ్రగ్స్ కోసం వాట్స్ యాప్ గ్రూపుల ద్వారా ఆర్డర్లు పంపారు. వాటన్నింటినీ సేకరించిన పోలీసులు, ప్రస్తుతానికి ఎక్కువ సార్లు డ్రగ్స్ కొనుగోలు చేశారని భావించిన వారికి మాత్రమే నోటీసులు పంపారు. వీరి విచారణ ముగిసిన తరువాత మరో 25 నుంచి 30 మందికి నోటీసులు ఇచ్చి, వారందరినీ ప్రశ్నించాలని ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.