యాప్నగరం

‘భరత్ అనే నేను’ రెండో పాట.. కేక పుట్టించిన ఫర్హాన్!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘భరత్ అనే నేను’ రెండో పాట వచ్చేసింది. ‘ఐ డోంట్ నో’ అంటూ సాగే ఈ పాటను బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ఆలపించడం విశేషం.

Samayam Telugu 1 Apr 2018, 10:54 am
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘భరత్ అనే నేను’ రెండో పాట వచ్చేసింది. ‘ఐ డోంట్ నో’ అంటూ సాగే ఈ పాటను బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ఆలపించడం విశేషం. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన అరగంటలోనే 2 లక్షల 50 వేల మందికి పైగా ఈ పాటను వీక్షించారు. వాస్తవానికి ఈ పాటను ఫర్హాన్ అక్తర్ ఆలపించినట్లు మహేష్ మార్చి 30వ తేదీ నాడే తెలియజేశారు. ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ఫర్హాన్ అక్తర్‌కు కృత‌జ్ఞతలు తెలియజేశారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమలోకి స్వాగతం పలికారు.
Samayam Telugu Mahesh

ఇదిలా ఉంటే, ‘భరత్ అనే నేను’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనుండటంతో అభిమానులు సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో క్రేజ్ మరింత పెరిగిపోయింవది. ఈ సినిమాలో మ‌హేష్‌ సరసన బాలీవుడ్ నటి కైరా అద్వానీ నటిస్తోంది. శరత్‌ కుమార్, ప్రకాష్ రాజ్‌, దేవరాజ్‌, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో క‌నిపించ‌నున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.