యాప్నగరం

‘బాలయ్యతో నటించాలంటే భయపడ్డా.. కానీ..’ ప్రగ్యా జైస్వాల్ సెన్సేషనల్ కామెంట్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా పంచుకుంది.

Samayam Telugu 14 May 2021, 6:09 pm
మెగా ప్రిన్స్ వరుణ్ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. తొలి సినిమాతో మంచి సక్సెస్‌నే అందుకున్నా.. ఆ తర్వాత ఈ భామకి మంచి హిట్లు రాలేదు. సరైన అవకాశాలు లేక.. పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా కూడా చేసింది ప్రగ్యా. అయితే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘అఖండ’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న ప్రగ్యా.. సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
Samayam Telugu ప్రగ్యా జైస్వాల్
Pragya Jaiswal


బాలకృష్ణ పక్కన హీరోయిన్‌ అనగానే తొలుత భయపడ్డానని.. కానీ, ఆయన సెట్‌లో చాలా సరదాగా ఉంటారని ప్రగ్యా పేర్కొంది. ‘‘బాలకృష్ణతో సినిమా అనగానే చాలా భయపడిపోయాను. ఆయనకి కోపం ఎక్కువ అని కొందరు చెప్పడమే అందుకు కారణం. కానీ, సెట్‌లోకి వెళ్లాక పరిస్థితి అలా లేదు. ఆయన చాలా సరదాగా ఉంటారు. జోక్స్ వేస్తూ.. అందరినీ నవ్విస్తుంటారు. ఆయన అంత కూల్‌గా ఉండటం చూసి.. నేను చాలా ధైర్యంగా నటించాను. సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నా’’ అని ప్రగ్యా తెలిపింది.

ఇక ‘అఖండ’ సినిమా విషయానికొస్తే.. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ఒకప్పటి హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా రెండు టీజర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తొలుత ప్రకటించిన ప్రకారం ఈ మే 28న విడుదల కావాల్సింది. కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదాపడటంతో.. సినిమా విడుదల కూడా వాయిదా పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.