యాప్నగరం

ఊచలు లెక్కపెట్టాల్సిన ఎంతో మంది మా వాళ్లే బయటున్నారు: మంచు విష్ణు

తను స్థానికుడు కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు ఏంటో తనకి బాగా తెలుసు కాబట్టి వాటిని పరిష్కరించగలనని మంచు విష్ణు అన్నారు. అంతేకానీ.. తెలుగు వ్యక్తి ‘మా’ అధ్యక్షుడు కావాలని తాను ఎప్పుడు చెప్పలేదని ఆయన పేర్కొన్నారు.

Samayam Telugu 20 Jul 2021, 10:17 pm
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై ఎక్కడ చూసిన చర్చ జరుగుతోంది. ఈసారి ఎన్నికలు మంచి వేడి మీద ఉన్నాయి. అధ్యక్ష బరిలో ఓవైపు ప్రకాష్ రాజ్, మరోవైపు మంచు విష్ణు పోటీ చేయడం.. వీరితో పాటు జీవితా రాజశేఖర్‌, హేమా, సీవీఎల్‌ నరసింహారావు కూడా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. పోలింగ్ జరగడానికి ఇంకా రెండు నెలల వ్యవధి ఉన్నప్పటికీ.. అభ్యర్థులు మాత్రం ఇప్పటికే ప్రచారం వేగవంతం చేశారు. ఎవరికి తోచిన స్టైల్‌లో వాళ్లు ఓటర్లను ఆకర్షించేలా పావులు కదుపుతున్నారు.
Samayam Telugu మంచు విష్ణు
Manchu Vishnu


ప్రకాష్ రాజ్ కొద్ది రోజుల క్రితం తన మద్దతు దారులతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన ఎజెండాను ప్రకటించారు. తాజాగా మంచు విష్ణు ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌కి ఈ విషయంపై ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కేవలం ‘మా’ బిల్డింగ్ మాత్రమే తన ఎజెండా కాదని.. ఇక్కడ ఇంాకా చాలా సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించడం కూడా తనకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు ‘మా’ బిల్డింగ్ కోసం సాయం చేసేందుకు ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణకి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. బాలకృష్ణ తన తండ్రి సమానుడు అని అలాంటి వ్యక్తి చెప్పిన పనిని తప్పకుండా చేస్తానని ఆయన అన్నారు.

ఇక కరోనా వచ్చిన సమయంలో ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు నరేష్ సినీ కార్మికులకు ఎంతో సహాయం చేశారని విష్ణు పేర్కొన్నారు. కష్ట సమయంలో సహాయం చేయడం చాలా గొప్ప విషయం అని.. కానీ, దాన్ని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని విష్ణు పేర్కొన్నారు. ఎవరైనా ఎదుటి వాళ్లకి ఆదర్శంగా ఉండాలి అని.. మనల్ని నమ్ముకున్న వాళ్లకి ఎలా అండగా ఉండాలి అనేదే తన ఎజెండా అని ఆయన అన్నారు.

ఇక ఇండస్ట్రీలో పోలీస్ స్టేషన్‌లో ఊచలు లెక్కపెట్టాల్సిన చాలా మంది తాను చేసిన సాయం వల్లే ఇప్పుడు బయట తిరుగుతున్నారని విష్ణు స్పష్టం చేశారు. ‘ఇండస్ట్రీలో ఎంతమంది సహాయం చేశాను అనే విషయాన్ని నేను చెప్పును. కొంతమంది ఊచలు లెక్కపెట్టకుండా ఉన్నారు అంటే ఎవరివల్లా అనే ప్రశ్న వాళ్లనే అడగాలి. అండర్‌వేర్లతో పోలీస్ స్టేషన్‌లో కూర్చొబెడితే.. తెల్లారి 4.30 గంటలకు వెళ్లి సర్ది చెప్పి బయటకు తీసుకువచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్లు కొంచం శృతి మించారంటే.. వాళ్ల పేర్లు బయటపెట్టాల్సి వస్తుంది’ అంటూ మంచు విష్ణు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.