I Have Taken 5 Years Gap From Movies For Studies, Says Annapurnamma Gari Manavadu Actor Baladitya
అమ్మకిచ్చిన మాట కోసం ఐదేళ్లు దూరంగా ఉన్నా: బాలాదిత్య
తెలుగు సినిమాల్లో బాల నటుడిగా బాలాదిత్య చెరిగిపోని ముద్ర వేశారు. సుమారు 40 సినిమాల్లో బాలాదిత్య బాలనటుడిగా నటించారు. ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’ సినిమాతో ఇండస్ట్రీకి బాలనటుడిగా పరిచయమైన బాలాదిత్య.. తొలి సినిమాతోనే తన ప్రత్యేకత చాటుకున్నారు. ‘అన్న’ సినిమాలో నటనకు గాను ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డు సైతం అందుకున్నారు. ‘లిటిల్ సోల్జర్స్’ సినిమాలో నటనకు కూడా నంది అవార్డు వచ్చింది. ‘బంగారు బుల్లోడు’, ‘హిట్లర్’, ‘అబ్బాయిగారు’, ‘హలో బ్రదర్’ ఇలా అప్పట్లో స్టార్ హీరోల సినిమాలన్నింటిలోనూ బాలనటుడిగా మెప్పించారు. బాలనటుడిగా సక్సెస్ అయిన బాలాదిత్య.. సోలో హీరోగా మాత్రం రాణించలేకపోయారు. ‘చంటిగాడు’ సినిమాతో హీరోగా మారిన బాలాదిత్య.. ‘1940లో ఒక గ్రామం’ వంటి జాతీయ అవార్డు చిత్రంలో హీరోగా నటించారు. అయినప్పటికీ ఆయనకు పెద్దగా కలిసిరాలేదు. చాలా కాలం విరామం తరవాత ఇటీవల ‘ఎంత మంచివాడవురా’ చిత్రంలో ఒక చిన్న పాత్ర చేశారు. ఇప్పుడు ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
Samayam Telugu10 Mar 2020, 6:17 pm
తెలుగు సినిమాల్లో బాల నటుడిగా బాలాదిత్య చెరిగిపోని ముద్ర వేశారు. సుమారు 40 సినిమాల్లో బాలాదిత్య బాలనటుడిగా నటించారు. ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’ సినిమాతో ఇండస్ట్రీకి బాలనటుడిగా పరిచయమైన బాలాదిత్య.. తొలి సినిమాతోనే తన ప్రత్యేకత చాటుకున్నారు. ‘అన్న’ సినిమాలో నటనకు గాను ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డు సైతం అందుకున్నారు. ‘లిటిల్ సోల్జర్స్’ సినిమాలో నటనకు కూడా నంది అవార్డు వచ్చింది. ‘బంగారు బుల్లోడు’, ‘హిట్లర్’, ‘అబ్బాయిగారు’, ‘హలో బ్రదర్’ ఇలా అప్పట్లో స్టార్ హీరోల సినిమాలన్నింటిలోనూ బాలనటుడిగా మెప్పించారు. బాలనటుడిగా సక్సెస్ అయిన బాలాదిత్య.. సోలో హీరోగా మాత్రం రాణించలేకపోయారు. ‘చంటిగాడు’ సినిమాతో హీరోగా మారిన బాలాదిత్య.. ‘1940లో ఒక గ్రామం’ వంటి జాతీయ అవార్డు చిత్రంలో హీరోగా నటించారు. అయినప్పటికీ ఆయనకు పెద్దగా కలిసిరాలేదు. చాలా కాలం విరామం తరవాత ఇటీవల ‘ఎంత మంచివాడవురా’ చిత్రంలో ఒక చిన్న పాత్ర చేశారు. ఇప్పుడు ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
కావాలని గ్యాప్ తీసుకోలేదు..
నర్రా శివనాగేశ్వర రావు (శివనాగు) దర్శకత్వంలో అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. యం.ఎన్.ఆర్. చౌదరి నిర్మాత. మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ ప్లే చేశాడు. సీనియర్ నటి జమున, బాలాదిత్య, అర్చన కీలకపాత్రలు పోషించారు. త్వరలో ఈ చిత్రం విడుదలకానున్న సందర్భంగా బాలాదిత్య మీడియాతో ముచ్చటించారు. సినిమాలకు తాను కావాలని గ్యాప్ తీసుకోలేదని.. చదువుకోవడం కోసం సినిమాలకు దూరంగా వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. తానెక్కడికో వెళ్లిపోయానని వచ్చిన వదంతుల్లో నిజం లేదన్నారు.
అమ్మకిచ్చిన మాట కోసం..
‘‘సినిమాలతో నేను ప్రయాణిస్తూనే ఉన్నాను. 2009లో నటించిన ‘1940లో ఒక గ్రామం’ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. తర్వాత సినిమాలకు కావాలని గ్యాప్ తీసుకోలేదు. ఎడ్యుకేషన్ కోసం దాదాపు ఐదేళ్లు బ్రేక్ తీసుకున్నాను. ఈ గ్యాప్లో నాపై చాలా అపోహలు వచ్చాయి. ఇండస్ట్రీ వదిలి సింగపూర్, మలేషియా వెళ్లిపోయానని కూడా వదంతులు వచ్చాయి. నాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పట్నుంచీ నేను నటిస్తున్నాను. ‘చంటిగాడు’ సినిమా టైంలో నాకు 17 ఏళ్లు. తర్వాత అమ్మకిచ్చిన మాట కోసం చదవడానికి బ్రేక్ తీసుకున్నాను’’ అని బాలాదిత్య వెల్లడించారు.
నన్ను మరిచిపోయారు..
‘‘ఐదేళ్ల గ్యాప్లో చాలామంది నన్ను మరిచిపోయారు. మళ్లీ ఇండస్ట్రీకి వచ్చానని.. తెలిసిన వాళ్లందరికీ తెలియజేశాను. నచ్చిన సినిమాలు రాలేదు.. వచ్చినవి నచ్చలేదు. మళ్లీ ఇన్నాళ్లకి ఇటీవల ‘ఎంత మంచివాడవురా’ చిత్రంలో నటించాను. తర్వాత నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనువడు’. ఈ సినిమాలో కీలక పాత్రన పోషించాను. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృత ప్రేమకథ స్పూర్తితో దర్శకుడు శివనాగు మా క్యారెక్టర్స్ క్రియేట్ చేశారు. పూర్తి సినిమాటిక్గా చిత్రీకరించారు. అర్చన నాకు జంటగా నటించారు. మా ఇద్దరి మధ్య ఓ డ్యూయెట్ కూడా ఉంది. మార్చి 15న ఆ పాటను విడుదల చేయనున్నారు’’ అని బాలాదిత్య చెప్పారు.
ప్రణయ్ పాత్రలో నటించా..
‘‘ఈ సినిమాలో సెకండాఫ్లో కనిపిస్తాను. పాత్ర నిడివి తక్కువైనా సినిమా మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్ర నటుడిగా నాకు మంచి గుర్తింపును తెస్తుందనే నమ్మకముంది. పాపులారిటీ ఉన్న వ్యక్తుల బయోపిక్లో నటిస్తే వారి గురించి నటించే ముందు మొత్తం తెలుసుకుంటాం. కానీ, ఈ సినిమాలో నటించిన తరవాత ప్రణయ్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి’’ అని సినిమా గురించి బాలాదిత్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను తమిళంలో ‘రాసాతి’ అనే సీరియల్లో నటిస్తున్నానని తెలిపారు. సన్ నెట్వర్క్ ప్రైమ్ టైంలో ఆ సీరియల్ వస్తుందని వెల్లడించారు. సీరియల్స్లో కూడా ప్రేక్షకులు రొటీన్ కార్యక్రమాలు చూడటం లేదని.. కొత్త కంటెంట్ ఉంటేనే ఆదరిస్తున్నారని బాలాదిత్య చెప్పారు. ఆర్టిస్ట్గా ‘రాసాతి’ సీరియల్లో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను చదువుకున్నది చెన్నైలోనే కావడం వల్ల తమిళం కూడా తనకు వచ్చన్నారు.
చిరంజీవి, నాగార్జున లాంటి వారు చేస్తున్నారు..
‘‘ఈటీవీలో వచ్చే ఛాంపియన్ కార్యక్రమం ద్వారా నేను మళ్లీ ప్రేక్షకులకు దగ్గరయ్యాను. టీవీ, సినిమాకు దగ్గర సంబంధం ఉంది. పెద్దవాళ్లే బుల్లితెరపై కనిపిస్తున్నారు.. మనం కన్పిస్తే తప్పేముంది అనుకుని ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టడం లేదు. చిరంజీవి, నాగార్జున లాంటి వారు సైతం టీవీ షోస్ చేస్తున్నారు. నటించేవారికి టీవీ షో, సీరియల్, వెబ్ సిరీస్, సినిమా.. ఇలా ఏదైనా ఒకటే. ఏదైనా కెమెరా ముందు నటించాల్సిందే’’ అని బాలాదిత్య అన్నారు. ఇటీవల జీ5లో ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ వెబ్ సీరిస్లో చేశానని.. ప్రస్తుతం తెలుగులో ఎలాంటి అవకాశం రాలేదన్నారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.