యాప్నగరం

విజయ్‌తో త్వరలోనే నటిస్తా: రష్మిక

తమిళ అగ్రహీరో విజయ్ 63వ చిత్రంలో హీరోయిన్గా రష్మికను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రంలో నయనతారను కథానాయికగా తీసుకున్నట్లు యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

Samayam Telugu 30 Nov 2018, 11:05 am
‘ఛలో’ చిత్రంలో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచిన సుందరాంగి రష్మిక మందాన. విజయ్ దేవరకొండ సరనన నటించిన ‘గీతగోవిందం’తో తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులను ఆక ట్టుకుంది. టాలీవుడ్‌లో దూసుకుపోతున్న రష్మికకు తమిళం నుంచి ఆఫర్లు వస్తున్నాయట. తమిళ అగ్రహీరో విజయ్ 63వ చిత్రంలో హీరోయిన్‌గా రష్మికను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రంలో నయనతారను కథానాయికగా తీసుకున్నట్లు యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
Samayam Telugu Rashmika-Mandanna


కానీ ఈ చిత్రంలో కథానాయిక తొలి ఆప్షన్‌గా రష్మికనే ఎంచుకున్నారని, ఆ తర్వాతే నయనతారను ఎంపిక చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై రష్మిక ట్విటర్లో స్పందించారు. ‘విజయ్, అట్లి చిత్రంలో నటిస్తున్నారా..? అని చాలా మంది అడిగారు. కానీ ఇప్పుడు అది జరగడంలేదు. వాళ్లతో త్వరలోనే నటిస్తాననే నమ్మకం ఉంది. ప్రేక్షకుల నుంచి ఇలాంటి ఆదరణ లభించడం చాలా సంతోషంగా ఉంది. కోలీవుడ్‌కు త్వరలోనే ఓ సినిమా ద్వారా పరిచయం కానున్నా. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.

ఈ విషయంపై స్పష్టత ఇచ్చిన రష్మిక.. చిత్ర యూనిట్ తనను ముందుగా సంప్రదించిందా? లేదా? అన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ సారికి అలా జరగలేదు... అని చెప్పడంతో చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించిన విషయం నిజమే అయి ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.