యాప్నగరం

Me Too: అక్షయ్ కుమార్ షాకింగ్ నిర్ణయం!

లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిగి, నిజాలు నిగ్గుతేలే వరకు షూటింగ్ నిలిపివేయాలని ‘హౌస్‌ఫుల్ 4’ నిర్మాతలను అక్షయ్ కోరారు.

Samayam Telugu 12 Oct 2018, 6:45 pm
బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోన్న #MeToo ఉద్యమానికి నటుడు అక్షయ్ కుమార్ మద్దతు తెలిపారు. లైంగిక వేధింపుల కేసులలో ఎవరైనా దోషిగా తేలితే.. అలాంటి వ్యక్తులతో తాను సినిమాలు చేయనని స్పష్టం చేశారు అక్షయ్. దర్శకుడు సాజిద్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం తెలేవరకు ‘హౌస్‌ఫుల్ 4’ నిర్మాతలు షూటింగ్ నిలిపివేయాలని నిర్మాతలను కోరారు. ‘విదేశాల నుంచి నిన్న రాత్రే వచ్చాను. వార్తలు చూస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఆరోపణలపై విచారణ జరిగి నిజాలు నిగ్గుతేలే వరకు షూటింగ్ నిలిపివేయాలని ‘హౌస్‌ఫుల్ 4’ నిర్మాతలను కోరుతున్నాను.
Samayam Telugu Akshay Kumar

బాధితులకు న్యాయం జరగాలంటే ఇలా చేయడం తప్పనిసరి. తప్పు చేసినట్లు తేలిన వారితో నేను సినిమాలు చేయను. అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి తప్పు చేశాడా లేదా అన్నది ప్రపంచానికి తెలియాలి. బాధితులకు కూడా కచ్చితంగా న్యాయం జరగాలని’ కోరుతూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్ సాజిద్ ఖాన్ ‘హౌస్‌ఫుల్ 4’ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Read also: MeToo సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి

తలుచుకుంటే భయమేస్తోంది: ట్వింకిల్
అక్షయ్ కుమార్ లేటెస్ట్ ప్రాజెక్ట్ హూస్‌ఫుల్ 4 దర్శకుడు సాజిద్ ఖాన్‌పై ఇద్దరు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వీటిపై నటుడు అక్షయ్ భార్య, నటి ట్వింకిల్ ఖన్నా స్పందించారు. ‘మహిళలపై జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మహిళలు ఆ వేధింపులను ఎలా ఎదుర్కొన్నారని ఆలోచిస్తేనే భయమేస్తోంది. హౌస్‌ఫుల్ 4 మూవీ యూనిట్ దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇలాంటి వి వాటిని తేలికగా తీసుకోవద్దని’ ట్వింకిల్ చేసిన ట్వీట్‌కు విశేష స్పందన వస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.