యాప్నగరం

Allu Arjun: ఆయన నేను పనికిరానని అనుకున్నారు.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా: అల్లు అర్జున్‌

తాతయ్య గారు తాను ఎందుకు పనికిరానని అనుకుని.. తన పేరు మీద రూ.10 లక్షలు ఇన్సురెన్స్ చేయించారని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గుర్తు చేసుకున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో 'అల్లు రామలింగయ్య' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

Authored byAshok Krindinti | Samayam Telugu 2 Oct 2022, 4:46 pm
దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గండిపేట్‌లో 10 ఎకరాల్లో భారీ స్థాయిలో నిర్మించిన అల్లు స్టూడియోస్ (Allu Studios) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రారంభించిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి హైదరాబాద్‌లో 'అల్లు రామలింగయ్య' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఆసక్తిర విషయాలు పంచుకున్నారు. తన తాత గారితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
Samayam Telugu Allu Ramalingaiah Book Launch event
అల్లు రామలింగయ్య బుక్ లాంచ్ ఈవెంట్


తాతయ్య గారితో శత జయంతి ఉత్సవాలు జరగడం చాలా సంతోషంగా ఉందని బన్నీ అన్నారు. తాను 16 ఏళ్ల వరకు తాతయ్య, నానమ్మలతోనే ఉన్నానని చెప్పారు. తాతయ్య చనిపోయాక.. తనకు మాత్రమే రూ.10 లక్షల ఇన్స్యూరెన్స్‌ డబ్బు వచ్చిందన్నారు. తాతయ్య ఎందుకు ఇలా చేశారని చాలా ఆలోచించానని.. బీమా కట్టిన సంవత్సరాన్ని చూస్తే అసలు విషయం అర్థమైందన్నారు. తాతయ్య డబ్బు జమ చేయడం మొదలు పెట్టిన టైమ్‌లో తాను నాలుగో తరగతి చదువుతున్నానని.. అప్పుడు మా తాతయ్య తాను ఎందుకు పనికిరానని ఇన్సూరెన్స్ చేయించారని చెప్పారు.


తనకు 18 ఏళ్ల వయసు వచ్చిన ఈ పది లక్షలు తనకు ఏదో ఒక రూపంలో ఉపయోగపడతాయని ఆయన భావించి.. ఈ డబ్బులు తన కోసమే జమ చేశారంటూ అల్లు అర్జున్ గుర్తు చేసుకున్నారు. తాతయ్య దృష్టిలో తాను ఎందుకూ పనికి రాని నేను.. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. అందుకు చాలా సంతోషంగా ఉందని.. ఆయన ఉంటే తన ఎదుగుదలను చూసి ఉంటే బాగుండేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.