యాప్నగరం

‘జైసింహా’కు ఐటీ షాక్.. నిర్మాత ఆఫీసులో సోదాలు

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘జైసింహా’ సినిమా వసూళ్లపై ఆదాయపన్ను శాఖ కన్నేసింది. ‘జైసింహా’ చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ కార్యాలయంపై బుధవారం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.

TNN 17 Jan 2018, 5:39 pm
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘జైసింహా’ సినిమా వసూళ్లపై ఆదాయపన్ను శాఖ కన్నేసింది. ‘జైసింహా’ చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ కార్యాలయంపై బుధవారం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుండటంతో ఆ చిత్ర నిర్మాత సి.కళ్యాణ్‌పై ఐటీ శాఖ దృష్టి సారించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో ఉన్న సి.కళ్యాణ్‌ కార్యాలయంలో కొంత మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయన నివాసంలో కూడా సోదాలు జరిపినట్లు తెలుస్తోంది.
Samayam Telugu income tax raids on jai simha producer office
‘జైసింహా’కు ఐటీ షాక్.. నిర్మాత ఆఫీసులో సోదాలు


సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో ‘జైసింహా’ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించారు. సినిమా కచ్చితంగా తనకు లాభాలు తెచ్చిపెడుతుందని ఆయన ధీమా ఉన్నారు. సినిమాకు టెంపుల్ సీన్ హైలైట్ అని, దానికి కోసం కోట్లు ఖర్చుపెట్టానని కళ్యాణ్ బహిరంగంగానే చెప్పారు. మరోవైపు ఈ సంక్రాంతికి వచ్చిన మిగిలిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ‘జైసింహా’కు థియేటర్లు పెరిగాయి. దీంతో ఇప్పటికే ఈ సినిమా రూ.21 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ రంగంలోకి దిగింది. సి.కళ్యాణ్ ఆదాయ పన్ను చెల్లింపులపై ఆరా తీస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.