ఇది చాలా హాట్ గురూ అంటూ ఉదయాన్నే మిమ్మల్ని కవ్వించే రేడియో మిర్చి ఇకపై అమెరికాలోనూ సందడి చేయనుంది. అవును.. భారతదేశ నం.1 రేడియో స్టేషన్ ‘రేడియో మిర్చి’ శనివారం (జనవరి 26) నుంచి అమెరికాలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. గణతంత్ర దినోత్సవ శుభ సమయాన యూఎస్లో.. రేడియో మిర్చి తన మొట్టమెదటి కేంద్రాన్ని ప్రారంభించింది. దీని ద్వారా అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, కన్నెక్టికట్ ప్రాంతాలకు సంబంధించిన మూడు రాష్ట్రాల పరిధిలో రేడియో మిర్చి కార్యక్రమాలు అందుబాటులోకి వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో 1600 AM ప్రిక్వెన్సీపై రేడియో మిర్చి కార్యక్రమాలను పొందవచ్చు. రాలే-దుర్హం, నార్త్ కరోలినా ప్రాంతాల్లో 99.9 FM HD-4, 101.9 FM మరియు 1490 AM, బల్టిమోర్, మేరిలాండ్లో 92.3 FM HD-2, ఫిలడెల్ఫియా, పెనిస్వేలియాలో 103.9 FM HD-2 పౌన:పున్యాలతో రేడియో మిర్చి కార్యక్రమాలను పొందవచ్చు.
అతి త్వరలో క్లేవ్లాండ్, ఓహియో, కొలంబస్, అట్లాంట, జార్జియా, రిచ్మండ్, వర్జీనియా, సెయింట్ లూయిస్, మిస్సోరి ప్రాంతాల్లోనూ రేడియో మిర్చి కార్యక్రమాలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికాలో రేడియో మిర్చి కేంద్రాలకు సంబంధించిన పూర్తి సమాచారం radiomirchiusa.com వెబ్సైట్ ద్వారా పొందవచ్చు.
దక్షిణాసియాకు చెందిన చాలా మంది అమెరికాలోని పలు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆయా వర్గాల్లో బాలీవుడ్ సినిమాలు, పాటలకు విశేష ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా వర్గాల ప్రజలకు మరింత ఎంటర్టైన్మెంట్ అందించడానికి రేడియో మిర్చి ఈ మహత్తర కార్యక్రమానికి పూనుకుంది. అమెరికాలోని ఆయా ప్రాంతాల్లో ఇకపై రేడియో మిర్చికే ప్రత్యేకమైన మ్యూజిక్, కామెడీ కార్యక్రమాలు తెగ సందడి చేయనున్నాయి.
రేడియో మిర్చిలో మిర్చి సయేమా, మిర్చి రోచీ, మిర్చి శృతి లాంటి కార్యక్రమాలకు విశేష ఆదరణ ఉంది. అమెరికాలో స్థిరపడ్డవారికి ఇకపై భారతీయ ఫ్లేవర్తో కూడిన ఎంటర్టైన్మెంట్ విండుభోజనంగా మారనుంది. భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన రేడియో మిర్చి అమెరికాలోనూ కార్యకలాపాలు ప్రారంభించడం పట్ల పలువురు భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో ఆ లోటు తీరుస్తుంది..
అమెరికాలోనూ రేడియో మిర్చి కార్యకలాపాలు ప్రారంభించడం పట్ల రేడియో మిర్చి ఎండీ, సీఈవో ప్రశాంత్ పాండే హర్షం వ్యక్తం చేశారు. ‘మాకిప్పుడు చెప్పలేనంత సంతోషం ఉంది. అమెరికాలో దక్షిణాసియా వారి కోసం పెద్దగా రేడియో కార్యక్రమాలు లేవు. ఆ లోటును తీరుస్తూ ఇప్పుడు రేడియో మిర్చి ఈ గడ్డపై కాలు మోపింది. ఇక్కడి ప్రేక్షకులను ఇది మరింత ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అని ఆయన అన్నారు.
ఇండియా గుండె చప్పుడు.. రేడియో మిర్చి
2001లో ప్రారంభమైన రేడియో మిర్చి.. మిర్చి, మిర్చి లవ్, కూల్, ఇష్క్ అనే నాలుగు రకాల బ్రాండ్లతో కార్యక్రమాలు అందిస్తోంది. దేశంలో అత్యధిక శ్రోతలను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా రేడియో మిర్చికి సుమారు 29 మిలియన్ల మంది శ్రోతలుగా ఉన్నారు.
మిర్చి మ్యూజిక్ అవార్డుల పేరుతో రేడియో మిర్చి ఏటా 8 విభాగాల్లో అవార్డులను కూడా అందజేస్తోంది. ఎనిమిది భాషల్లో ఈ అవార్డులను అందిస్తోంది. మ్యూజిక్ లవర్ల కోసం ప్రపంచ ప్రసిద్ధ గాయకులు, రాక్స్టార్లతో పలు ప్రాంతాల్లో కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఏటా 100కు పైగా కార్యక్రమాలతో యువతలో నూతనోత్తేజాన్ని నింపుతోంది. సోషల్ మీడియాలోనూ ప్రత్యేక కార్యక్రమాలతో విశేష ఆదరణను సొంతం చేసుకుంది.
అతి త్వరలో క్లేవ్లాండ్, ఓహియో, కొలంబస్, అట్లాంట, జార్జియా, రిచ్మండ్, వర్జీనియా, సెయింట్ లూయిస్, మిస్సోరి ప్రాంతాల్లోనూ రేడియో మిర్చి కార్యక్రమాలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికాలో రేడియో మిర్చి కేంద్రాలకు సంబంధించిన పూర్తి సమాచారం radiomirchiusa.com వెబ్సైట్ ద్వారా పొందవచ్చు.
దక్షిణాసియాకు చెందిన చాలా మంది అమెరికాలోని పలు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆయా వర్గాల్లో బాలీవుడ్ సినిమాలు, పాటలకు విశేష ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా వర్గాల ప్రజలకు మరింత ఎంటర్టైన్మెంట్ అందించడానికి రేడియో మిర్చి ఈ మహత్తర కార్యక్రమానికి పూనుకుంది. అమెరికాలోని ఆయా ప్రాంతాల్లో ఇకపై రేడియో మిర్చికే ప్రత్యేకమైన మ్యూజిక్, కామెడీ కార్యక్రమాలు తెగ సందడి చేయనున్నాయి.
రేడియో మిర్చిలో మిర్చి సయేమా, మిర్చి రోచీ, మిర్చి శృతి లాంటి కార్యక్రమాలకు విశేష ఆదరణ ఉంది. అమెరికాలో స్థిరపడ్డవారికి ఇకపై భారతీయ ఫ్లేవర్తో కూడిన ఎంటర్టైన్మెంట్ విండుభోజనంగా మారనుంది. భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన రేడియో మిర్చి అమెరికాలోనూ కార్యకలాపాలు ప్రారంభించడం పట్ల పలువురు భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో ఆ లోటు తీరుస్తుంది..
అమెరికాలోనూ రేడియో మిర్చి కార్యకలాపాలు ప్రారంభించడం పట్ల రేడియో మిర్చి ఎండీ, సీఈవో ప్రశాంత్ పాండే హర్షం వ్యక్తం చేశారు. ‘మాకిప్పుడు చెప్పలేనంత సంతోషం ఉంది. అమెరికాలో దక్షిణాసియా వారి కోసం పెద్దగా రేడియో కార్యక్రమాలు లేవు. ఆ లోటును తీరుస్తూ ఇప్పుడు రేడియో మిర్చి ఈ గడ్డపై కాలు మోపింది. ఇక్కడి ప్రేక్షకులను ఇది మరింత ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అని ఆయన అన్నారు.
ఇండియా గుండె చప్పుడు.. రేడియో మిర్చి
2001లో ప్రారంభమైన రేడియో మిర్చి.. మిర్చి, మిర్చి లవ్, కూల్, ఇష్క్ అనే నాలుగు రకాల బ్రాండ్లతో కార్యక్రమాలు అందిస్తోంది. దేశంలో అత్యధిక శ్రోతలను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా రేడియో మిర్చికి సుమారు 29 మిలియన్ల మంది శ్రోతలుగా ఉన్నారు.
మిర్చి మ్యూజిక్ అవార్డుల పేరుతో రేడియో మిర్చి ఏటా 8 విభాగాల్లో అవార్డులను కూడా అందజేస్తోంది. ఎనిమిది భాషల్లో ఈ అవార్డులను అందిస్తోంది. మ్యూజిక్ లవర్ల కోసం ప్రపంచ ప్రసిద్ధ గాయకులు, రాక్స్టార్లతో పలు ప్రాంతాల్లో కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఏటా 100కు పైగా కార్యక్రమాలతో యువతలో నూతనోత్తేజాన్ని నింపుతోంది. సోషల్ మీడియాలోనూ ప్రత్యేక కార్యక్రమాలతో విశేష ఆదరణను సొంతం చేసుకుంది.