యాప్నగరం

ఆయన రూ.50లక్షలు అప్పిచ్చారు: జగపతిబాబు

తను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు

Samayam Telugu 27 Aug 2018, 4:11 pm
తను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ యాభై లక్షల రూపాయల మొత్తాన్ని అప్పుగా ఇచ్చారని చెప్పాడు నటుడు జగపతిబాబు. ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో జగపతి ఈ విషయాన్ని చెప్పారు. ఆ డబ్బును కొంతకాలం తర్వాత తను తిరిగి నిమ్మగడ్డకు ఇచ్చేశానని, అయితే ఆయన వడ్డీ ఏమీ అడగకుండా తనకు డబ్బిచ్చారని జగపతి వివరించారు.
Samayam Telugu Jagapathi_Babu


తన ఆర్థిక సంబంధ విషయాలను ఏమీ దాచకుండా వివరించాడు జగపతిబాబు. కెరీర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తను ఖర్చులకు కూడా డబ్బు లేక ఇబ్బంది పడ్డాను అని జగపతి వివరించాడు. అలాంటి సమయంలో తనకు ఎవరూ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని, ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఎవరి నుంచి కూడా తను డబ్బు ఆశించలేదని ఈ నటుడు అన్నారు. అయితే నిమ్మగడ్డ తనను పిలిచి.. 50 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చారని, వడ్డీ లేకుండా తీసుకొమ్మన్నారని జగపతిబాబు చెప్పాడు.

తర్వాత అవసరమని నిమ్మగడ్డ డబ్బును వెనక్కు అడిగారని... తను వెనక్కు ఇచ్చేశానని పేర్కొన్నాడు. ప్రస్తుతం తనకు ఆర్థిక కష్టాలు ఏమీ లేవని.. ‘లెజెండ్’ సినిమా తర్వాత తన దశ మారిపోయిందని జగపతి అన్నాడు. ఆ సినిమాకు తను ఊహించిన దానికి మూడు రెట్లు ఎక్కువ పారితోషకం ఇచ్చారని.. ఆ సినిమా హిట్ కావడం.. విలన్‌ పాత్రలు వరస పెట్టి దక్కడంతో ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడిందని అన్నాడు. ప్రస్తుతం తను ఖరీదైన కార్లను కొనగలిగే స్థితిలో ఉన్నట్టుగా జగపతి బాబు చెప్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.