యాప్నగరం

'జాగ్వార్' ఆడియోకి చీఫ్ గెస్ట్‌గా మంత్రి కేటీఆర్

జాగ్వార్ సినిమా ఆడియో ఫంక్షన్ హైదరాబాదులోని నోవాటెల్ లో ఆదివారం గ్రాండ్ గా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు...

TNN 18 Sep 2016, 9:05 pm
మాజీ పీఎం దేవెగౌడ మనుమడు, కర్ణాటక మాజీ సీఎం హెచ్. డి. కుమారస్వామి తనయుడు అయిన నిఖిల్ కుమార్ గౌడను హీరోగా పరిచయం చేస్తూ 'జాగ్వార్' అనే టైటిల్ తో, రూ. 75 కోట్ల భారీ బడ్జెట్ తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ హైదరాబాదులోని నోవాటెల్ లో ఆదివారం గ్రాండ్ గా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. దేవెగౌడ,హెచ్. డి. కుమారస్వామి లతో పాటు పీవీ సింధు, జగపతి బాబు, సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Samayam Telugu jaguar movie audio releasing in hyderabad ktr have been invited as a chief guest
'జాగ్వార్' ఆడియోకి చీఫ్ గెస్ట్‌గా మంత్రి కేటీఆర్

బాహుబలి, భజరంగీ భాయిజాన్ చిత్రాల తర్వాత సెన్సేషనల్ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ జాగ్వార్ సినిమాకు కథను అందిస్తున్నారు. ఎ. మహదేవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా దీప్తి సతి నటిస్తుంది. ఈ సినిమాలో జగపతి బాబు, రమ్యకృష్ణ లాంటి విలక్షణ నటులు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్. ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంతటి ఘనమైన విశేషాలు ఉన్న ఈ సినిమా హైఓల్టేజ్ పవర్ ప్యాక్ గా తెరకెక్కుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.