జై భీమ్ (Jai Bhim) కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. సూర్య (Surya) హీరోగా గత ఏడాది నవంబరులో విడుదలైన ‘జై భీమ్’ మూవీ ఊహించని విధంగా బ్లాక్బాస్టర్ హిట్గా నిలిచింది. అమెజాన్ ప్రైమ్లో డైరెక్ట్గా ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఒక యథార్థ ఘటనని ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు జ్ఞానవేల్ (Gnanavel) చాలా ఇంట్రస్టింగ్గా ఈ సినిమాని తెరకెక్కించాడు. సూర్య నటన ఈ సినిమాని వేరే లెవల్కి తీసుకెళ్లింది. ఈ మూవీకి పలు అవార్డులు రావడంతో పాటు అంతర్జాతీయ ఫిల్మ్ పెస్టివల్లోనూ ప్రదర్శించారు. జై భీమ్ సీక్వెల్ మూవీని సూర్య, జ్యోతికల సంయుక్త నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ నిర్మించబోతోంది. జ్ఞానవేల్ మరో యథార్థ ఘటనని సూర్యాకి ఇటీవల వినిపించగా.. స్టోరీ లైన్ నచ్చడంతో సూర్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లబోతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయని.. నటుల ఎంపిక, స్క్రిప్స్ని సిద్ధం చేసే పనిలో జ్ఞానవేల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి జ్ఞానవేల్ చేతిలో ఇప్పుడు ఒక సినిమా ఉంది. శరవణ భవన్ హోటల్ వ్యవస్థాపకుడు రాజగోపాల్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తీయబోతున్నాడు. ఈ మూవీకి ‘దోస కింగ్’ అనే టైటిల్ని కూడా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుండగా.. మార్చి నుంచి జై భీమ్-2 సెట్స్పైకి వెళ్లనుంది.
వాస్తవానికి జ్ఞానవేల్ చేతిలో ఇప్పుడు ఒక సినిమా ఉంది. శరవణ భవన్ హోటల్ వ్యవస్థాపకుడు రాజగోపాల్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తీయబోతున్నాడు. ఈ మూవీకి ‘దోస కింగ్’ అనే టైటిల్ని కూడా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుండగా.. మార్చి నుంచి జై భీమ్-2 సెట్స్పైకి వెళ్లనుంది.