యాప్నగరం

ఉద్యోగుల సొమ్ముతో వ్యాపారమా బాబూ..?: పవన్ ప్రశ్న

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Samayam Telugu 22 May 2018, 4:35 pm
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. పోరాట యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ ఉద్యోగులతో భేటీ అనంతరం మీడియాకు లేఖను విడుదల చేశారు పవన్ కళ్యాణ్. ఈ లేఖలో.. ఉద్యోగుల సొమ్ముతో ప్రభుత్వం వ్యాపారం చేస్తుందంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్.
Samayam Telugu పవన్ కళ్యాణ్


కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) పేరుతో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మూలంగా ఉద్యోగులు నష్టపోతున్నారన్నారు. సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగులు నిరసన తెలిపినా ప్రభుత్వం నుండి స్పందన లేదన్నారు. ఉద్యోగులకు అన్యాయం జరిగితే జనసేన చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. వారి కుటుంబాలకి ఎదురయ్యే ఇబ్బందులూ తెలుసు.

మా నాన్న కూడా ప్రభుత్వ ఉద్యోగే. జీవితం చివరి వరకూ ఆయన ఎప్పుడూ మా మీద ఆధారపడలేదు. తనకు వచ్చే పెన్షన్ మీదే బతికారు. సీపీఎస్ విధానంపై ప్రభుత్వ పెద్దలతో తప్పకుండా మాట్లాడతాను. 30 ఏళ్లు ఉద్యోగం చేశాక ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ ఆధారంగా ఉంటుంది. ఆ సొమ్ముని షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ఏమిటి? ఈ తరహా చట్టం చేసిన నాయకుల పెన్షన్లకి సీపీఎస్ పెట్టలేదంటూ పెన్షన్ విధానంపై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు జనసేనాని.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.