యాప్నగరం

పవన్ కాబోయే సీఎం.. 2024లో మాదే ప్రభుత్వం: నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేస్తామనే నమ్మకం తమకు ఉందని సినీ నటుడు, జనసేన నేత నాగబాబు అన్నారు. పవన్ కాబోయే సీఎం అని ఉద్ఘాటించారు.

Samayam Telugu 14 Jun 2020, 8:05 pm
మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో మీడియాలో బాగా హైలైట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో గాడ్సేపై ఆయన చేసిన ట్వీట్లు దుమారం రేపాయి. గాంధీని చంపిన గాడ్సే గురించి ఆయన పాజిటివ్‌గా ట్వీట్లు చేయడంతో చాలా మంది విమర్శలు గుప్పించారు. అలాగే, సినీ పెద్దల సమావేశాల గురించి బాలకృష్ణ చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ నాగబాబును టార్గెట్ చేసి సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఎవరు ఏం చేసినా, ఎంత విమర్శించినా తనకు న్యాయం అనిపించే పనిని తాను చేయక మానను అంటున్నారు నాగబాబు. తన అన్నయ్య, తమ్ముడు జోలికి వస్తే ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు.
Samayam Telugu నాగబాబు
Nagababu


Also Read: అన్నయ్య బ్లడ్ బ్యాంక్‌లో నాగబాబు రక్తదానం

నాగాబాబు తాజాగా 99టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో జనసేన రాజకీయ భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగబాబు. ‘‘2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి లక్ష కారణాలు ఉన్నాయి. ఓటమి చెందాం కాబట్టి అయ్యో అని బాధపడట్లేదు. మేం ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు ఫైట్ చేస్తూనే ఉంటాం. బీజేపీ పొత్తుతో 2024లో మేం కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామనే నమ్మకం నాకుంది. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని నేను ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను’’ అని నాగబాబు ఉద్ఘాటించారు.

టీడీపీకి ఛాన్స్ లేదు..
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అస్సలు అవకాశమే లేదన్నారు నాగబాబు. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం రెండు పార్టీలే ఉంటాయని.. అవి వైఎస్సార్‌సీపీ, జనసేన అని నాగబాబు తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు హయాంలో టీడీపీ పార్టీ చేసినంత అవినీతి ఎవ్వరూ చేయలేదని నాగబాబు అన్నారు. ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయని.. అందులో భాగంగానే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన అవకతవకలు, దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావని వ్యాఖ్యానించారు. అందుకే ప్రజలు చంద్రబాబుని తిరస్కరించి జగన్‌ను గెలిపించారని అన్నారు. ఒకవేళ జగన్ బాగా చేయకపోతే చంద్రబాబును ప్రజలు ఎన్నుకుంటారని తాను అనుకోవడం లేదన్నారు.

ఏకైక నాయకుడు పవన్..
ప్రస్తుత రాజకీయాల్లో జనసేన పరిస్థితి గురించి నాగబాబు వివరిస్తూ.. ‘‘ప్రస్తుత రాజకీయాల్లో నిజాయతీ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్. నిజాయతీ మాత్రమే కాదు.. మంచి వ్యక్తి. ప్రజలకు మంచి చేయాలనే భావన కలిగిన వ్యక్తి. ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తి. గ్లామర్ కలిగిన వ్యక్తి. ఇన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఒక వ్యక్తిలో ఉండటం చాలా అరుదు’’ అని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సొంతంగా ఒక పేపర్ పెట్టే ఆలోచనలో ఉన్నారని.. దానికి కావాల్సిన వనరులు సమకూరిన వేళ కచ్చితంగా పేపర్ పెడతారని నాగబాబు స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.