యాప్నగరం

ఆడియెన్స్‌తో 'జయమ్ము నిశ్చయమ్ము రా' యూనిట్

శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశీవాళీ వినోదాన్ని పంచుతూ...

Samayam Telugu 28 Nov 2016, 5:08 am
ఈనెల 25న విడుదలై ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకొంటున్న చిత్రం "జయమ్ము నిశ్చయమ్ము రా". శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశీవాళీ వినోదాన్ని పంచుతూ విజయపధంలో పయనిస్తోంది. మూవీ సక్సెస్ అయిన నేపథ్యంలో హీరోహీరోయిన్లయిన శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ, డైరెక్టర్ శివరాజ్ కనుమూరి, ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి, యూనిట్ సభ్యులు ఆడియెన్స్‌ని నేరుగా పలకరించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తమ చిత్రానికి ఘన విజయం అందించినందుకు ప్రేక్షకులకు కృతజ్నతలు తెలియజేశారు. అమీర్‌పేట్‌లోని సత్యం థియేటర్, మూసాపేటలోని లక్ష్మీకళ, కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్లను సందర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.