యాప్నగరం

‘మహర్షి’ తల్లిని మార్చేశారు!

‘భరత్ అనే నేను’ సూపర్ హిట్ తరువాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మ‌హ‌ర్షి’.

Samayam Telugu 29 Aug 2018, 10:09 pm
‘భరత్ అనే నేను’ సూపర్ హిట్ తరువాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మ‌హ‌ర్షి’. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుండగా.. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మహేష్ కెరియర్ 25 చిత్రంతో భారీ హంగులతో అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ రాబట్టడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.
Samayam Telugu Mahesh Babu


మ‌హేష్ త‌ల్లి పాత్ర‌కు సంబంధించి చాలా మంది సీనియ‌ర్ హీరోయిన్‌లు ప్రచారంలో ఉండగా.. అలనాటి అందాల నటి జయప్రద పేరు ఎక్కువగా వినిపించింది. అయితే మహేష్ తల్లి పాత్రలో జయప్రద ప్లేస్‌ను సహజనటి జయసుధ రీప్లేస్ చేసినట్టు తాజా సమాచారం. ఈ మూవీలో మహేష్‌కి తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్టో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారులోకం, శతమానం భవతి వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో హిట్ పెయిర్‌గా పేరొందిన ప్రకాష్ రాజ్, జయసుధల జంటను ‘మహర్షి’ సినిమాలో రిపీట్ చేయనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చుతుండగా.. ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘మహర్షి’.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.