మళయాలంలో వచ్చిన జోసెఫ్ సినిమాకు రీమేక్గా శేఖర్ అనే చిత్రం రాబోతోంది. ఇందులో రాజశేఖర్ హీరోగా నటిస్తున్నాడు. జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించింది. ఈ సినిమాలో శివానీ రాజశేఖర్ ఓ ముఖ్యపాత్రలో కనిపించనుంది. అయితే ఈ మూవీ మే 20న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లు పెంచేశారు. ఈ సందర్భంగా నేడు (మే 17) ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్లో యూట్యూబ్ నిఖిల్ సందడి చేశాడు. స్టేజ్ మీదకు ఎక్కిన నిఖిల్.. శివానీ, శివాత్మికలకు ఇరికించే ప్రయత్నం చేశాడు. పర్సనల్ క్వశ్చన్స్ అడిగి.. అందరి ముందు బుక్ చేయాలని చూశాడు. ఇంట్లో ఎవరు ఎక్కువగా అల్లరి చేస్తారు.. ఎవరు ఎక్కువగా రెడీ అవుతారు? ఎవరు అమ్మానాన్నలను చిరాకు పెడుతుంటారు? అని ఇలా ప్రశ్నలు విసిరాడు.
రెడీ అవ్వడంతో శివానీ ఎక్కువ సమయం తీసుకుంటుందట. సమయాన్ని పట్టి రెడీ అవుతుందట. ఒక్కోసారి గంట తీసుకుంటుందట. ఇంకొన్ని సార్లు పది నిమిషాల్లో కూడా రెడీ అవుతుందట. ఇక ఎవరు ఎక్కువగా ఇరిటేట్ చేస్తారు అనే ప్రశ్నకు వింత సమాధానం వచ్చింది. తానే తన పిల్లలను ఎక్కువగా ఇరిటేట్ చేస్తాను అని జీవిత చెప్పుకొచ్చింది.
ఎవరు ఎక్కువగా ఖర్చు పెడతారు అనే ప్రశ్నకు అసలు విషయం బయటకు వచ్చింది. ఇద్దరూ ఫుడ్ మీద ఎక్కువగా ఖర్చు పెడతారు అని, అందులో శివానీ అయితే స్విగ్గీ వాళ్లతో గొడవలు పెట్టుకుంటుంది.. కొంచెం ఆలస్యమైనా డబ్బులు ఇవ్వదు అంటూ జీవిత చెప్పుకుంటూ పోయింది. ఇవన్నీ నిన్ను అడిగారా? అని శివానీ కవర్ చేేసే ప్రయత్నం చేసింది. మొత్తానికి జీవిత మాత్రం తన కూతురు శివానీ గురించి ఆసక్తికరమైన విషయం చెప్పేసింది.
రెడీ అవ్వడంతో శివానీ ఎక్కువ సమయం తీసుకుంటుందట. సమయాన్ని పట్టి రెడీ అవుతుందట. ఒక్కోసారి గంట తీసుకుంటుందట. ఇంకొన్ని సార్లు పది నిమిషాల్లో కూడా రెడీ అవుతుందట. ఇక ఎవరు ఎక్కువగా ఇరిటేట్ చేస్తారు అనే ప్రశ్నకు వింత సమాధానం వచ్చింది. తానే తన పిల్లలను ఎక్కువగా ఇరిటేట్ చేస్తాను అని జీవిత చెప్పుకొచ్చింది.
ఎవరు ఎక్కువగా ఖర్చు పెడతారు అనే ప్రశ్నకు అసలు విషయం బయటకు వచ్చింది. ఇద్దరూ ఫుడ్ మీద ఎక్కువగా ఖర్చు పెడతారు అని, అందులో శివానీ అయితే స్విగ్గీ వాళ్లతో గొడవలు పెట్టుకుంటుంది.. కొంచెం ఆలస్యమైనా డబ్బులు ఇవ్వదు అంటూ జీవిత చెప్పుకుంటూ పోయింది. ఇవన్నీ నిన్ను అడిగారా? అని శివానీ కవర్ చేేసే ప్రయత్నం చేసింది. మొత్తానికి జీవిత మాత్రం తన కూతురు శివానీ గురించి ఆసక్తికరమైన విషయం చెప్పేసింది.