తెలంగాణ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకే మొదలైన పోలింగ్లో (Telangana Elections 2023) పలువురు సినీ సెలబ్రెటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూ ఎన్టీఆర్ (NTR), అల్లు అర్జున్ (Allu Arjun).. క్యూ లైన్లో నిల్చొని తమ ఓటు వేశారు.
కుటుంబంతో కలిసి
ఎన్టీఆర్ అయితే తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్లోని ఓబుల్రెడ్డి స్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఎన్టీఆర్ క్యూ లైన్లో కనిపించారు. ఇక అల్లు అర్జున్ అయితే బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక అలానే జూబ్లీహిల్స్ క్లబ్లో సుమంత్ ఓటు వేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా తన ఓటు వేశారు.
ఇక తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీమణి సురేఖ తన కూతురు శ్రీజతో కలిసి పోలింగ్ కేంద్ర దగ్గర చిరు కనిపించారు. అలానే నాగార్జున, అమల, నాగచైతన్య, హీరో గోపీచంద్, రామ్ పోతినేని, నాని, డైరెక్టర్లు హరీశ్ శంకర్, సాయి రాజేష్, మారుతీ, సుకుమార్, బండ్ల గణేశ్, ఎస్కేఎన్ సహా పలువురు సినీ సెలబ్రెటీలు తమ ఓటును వేశారు.
కుటుంబంతో కలిసి
ఎన్టీఆర్ అయితే తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్లోని ఓబుల్రెడ్డి స్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఎన్టీఆర్ క్యూ లైన్లో కనిపించారు. ఇక అల్లు అర్జున్ అయితే బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక అలానే జూబ్లీహిల్స్ క్లబ్లో సుమంత్ ఓటు వేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా తన ఓటు వేశారు.
ఇక తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీమణి సురేఖ తన కూతురు శ్రీజతో కలిసి పోలింగ్ కేంద్ర దగ్గర చిరు కనిపించారు. అలానే నాగార్జున, అమల, నాగచైతన్య, హీరో గోపీచంద్, రామ్ పోతినేని, నాని, డైరెక్టర్లు హరీశ్ శంకర్, సాయి రాజేష్, మారుతీ, సుకుమార్, బండ్ల గణేశ్, ఎస్కేఎన్ సహా పలువురు సినీ సెలబ్రెటీలు తమ ఓటును వేశారు.
- Read latest TV News and Movie Updates