యాప్నగరం

ఒకే వేదికపైకి నందమూరి హీరోలు.. ఈ సమయంలో సాధ్యమేనా?

ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఒకరి సినిమా వేడుకలకు మరొకరు వెళ్లటం సర్వసాధారణం. కానీ నందమూరి ఫ్యామిలీ విషయంలో మాత్రం అలా కాదు. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఒకరి సినిమా వేడుకలో మరొకరు పాల్గొనటం ఓ అరుదైన కలయికగానే భావిస్తారు సినీ జనాలు. ముఖ్యంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, బాలకృష్ణలు ఒకే వేదిక మీద కలవటం అన్నది ఎప్పుడూ ప్రత్యేకమే.

Samayam Telugu 4 Jan 2020, 11:45 am
ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఒకరి సినిమా వేడుకలకు మరొకరు వెళ్లటం సర్వసాధారణం. కానీ నందమూరి ఫ్యామిలీ విషయంలో మాత్రం అలా కాదు. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఒకరి సినిమా వేడుకలో మరొకరు పాల్గొనటం ఓ అరుదైన కలయికగానే భావిస్తారు సినీ జనాలు. ముఖ్యంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, బాలకృష్ణలు ఒకే వేదిక మీద కలవటం అన్నది ఎప్పుడూ ప్రత్యేకమే.
Samayam Telugu jr ntr and balakrishna guests for kalyan rams entha manchivadavura pre release
ఒకే వేదికపైకి నందమూరి హీరోలు.. ఈ సమయంలో సాధ్యమేనా?


ఎన్టీఆర్‌ బయోపిక్‌ సందర్భంగా కలిసిన నందమూరి హీరోలు

త్వరలో అలాంటి అరుదైన కలయికకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. గత ఏడాది ఎన్టీఆర్‌ బయోపిక్‌గా తెరకెక్కిన ఎన్టీఆర్‌ కథానాయకుడు సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు ఎన్టీఆర్‌ హాజరయ్యాడు. ఆ సమయంలో బాలకృష్ణతో కలిసి ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌లు వేదిక మీద సందడి చేశారు. అయితే ఆ తరువాత తిరిగి ఎన్టీఆర్‌, బాలయ్యలు ఓకే వేదిక మీద కనిపించిన సందర్భం లేదు.

రాజకీయాల కారణంగా పెరిగిన దూరం

ప్రస్తుతం రాజకీయపరంగా కూడా ఎన్టీఆర్‌, బాలకృష్ణల మధ్య దూరం బాగా పెరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు తనయుడు, బాలకృష్ణ అల్లుడు లోకేష్‌ బాబు వారసుడన్న ప్రచారం జరుగుతుండగా ఓ వర్గం మాత్రం ఎన్టీఆర్‌ను తెర మీదకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంపై ఎన్టీఆర్‌ స్పందిచకపోయినా ఏదో ఒక రోజు లోకేష్‌కు ఎన్టీఆర్‌ వల్ల ఇబ్బంది తప్పదేమో అన్న భయం మాత్రం టీడీపీ వర్గాల్లో కనిపిస్తోంది.

ఎంత మంచి వాడవురా వేడుకకు నందమూరి ఫ్యామిలీ

ఈ సమయంలో ఓ సినిమా వేడుకలో ఎన్టీఆర్, బాలకృష్ణలు పాల్గొనబోతున్నారన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఎంత మంచివాడవురా. త్వరలో జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు ఎన్టీఆర్‌తో పాటు బాలకృష్ణ కూడా హాజరు కాబోతున్నాడట. ఇదే నిజమైతే దాదాపు సంవత్సరం తరువాత ఎన్టీఆర్‌, బాలయ్యలు ఒక వేదిక మీద కలవనున్నారు. హరికృష్ణ మరణించినప్పుడు కలిసినా అది కుటుంబ కార్యక్రమం కావటంతో సినిమా వేడుకలో నందమూరి హీరోలను చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.

సంక్రాంతి బరిలో ఎంత మంచివాడవురా

శతమానం భవతి ఫేం సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జోడిగా మెహరీన్‌ నటించింది. శివలెంక కృష్ణ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించాడు. మలయాళ మ్యూజిక్‌ సెన్సేషన్‌ గోపిసుందర్‌ సంగీతమందించాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.