యాప్నగరం

ట్రింగ్ ట్రింగ్.. చరణ్, అల్లు అర్జున్ బాటలో ఎన్టీఆర్!

‘జై లవ కుశ’లో ‘ట్రింగ్ ట్రింగ్ తడాంగు ట్రింగ్ ట్రింగ్’ అంటూ అలరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇప్పుడు నిజంగానే ట్రింగ్ ట్రింగ్ అంటూ మన ముందుకు రాబోతున్నారు.

Samayam Telugu 12 Jul 2018, 9:37 pm
‘జై లవ కుశ’లో ‘ట్రింగ్ ట్రింగ్ తడాంగు ట్రింగ్ ట్రింగ్’ అంటూ అలరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇప్పుడు నిజంగానే ట్రింగ్ ట్రింగ్ అంటూ మన ముందుకు రాబోతున్నారు. సరికొత్త మొబైల్ బ్రాండ్ ‘సెలెక్ట్’కు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. దీంతో ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్, అల్లు అర్జున్ క్లబ్‌లో చేరినట్లయ్యింది.
Samayam Telugu dc-Cover-v9lvls8l7v4og61qs6a5r2edn6-20170928234246


రామ్‌ చరణ్‌ ‘హ్యాపీ’ మొబైల్స్‌కు, అల్లు అర్జున్‌ ‘లాట్‌’ మొబైళ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఎన్టీఆర్ కూడా ‘సెలక్ట్’ బ్రాండ్ కోసం పలు ప్రకటనల్లో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి కావచ్చినట్లు తెలిసింది. జులై 13న ఓ ప్రముఖ హోటల్‌లో జరిగే కార్యక్రమంలో ఎన్టీఆర్ ప్రకటనను విడుదల చేసే అవకాశాలున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.