యాప్నగరం

Jr Ntr: మిస్ యూ నాన్నా.. తారక్ భావోద్వేగ పోస్ట్

మిస్ యు నాన్నా అంటూ నందమూరి హరికృష్ణను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు ఎన్టీఆర్. నేడు నందమూరి హరికృష్ణ 64వ జయంతి కావడంతో ట్వీట్ చేశారు తారక్.

Samayam Telugu 2 Sep 2020, 11:27 am
దివంగత నటుడు, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ 64వ జయంతి సందర్భంగా తండ్రిని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు జూనియర్ ఎన్టీఆర్. తండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఎమోషనల్ పోస్ట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
Samayam Telugu ఎన్టీఆర్, ఎన్టీఆర్
Ntr And Hari Krishna


‘ మిస్ యూ నాన్నా.. ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ప్రస్థానానికి నేతృత్వం మీరు . ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే’.. మీ 64వ జయంతిన మిమ్మల్ని స్మరించుకుంటూ మీ నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారకరామారావు’ అంటూ ట్విట్టర్ ద్వారా భావోద్వేగ మెసేజ్‌ను అభిమానులతో పంచుకున్నారు తారక్.

ఎన్టీఆర్ రధసారథిగా.. రాజకీయ నాయకుడిగా.. ఖ్యాతి గడించిన నందమూరి హరికృష్ణ 2018 ఆగష్టు 29న నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.